Weight Loss: ఈరోజుల్లో అందరూ ఎదుర్కొంటున్న కామన్ ప్రాబ్లమ్స్ లో అధిక బరువు కూడా ఒకటి.. బరువు పెరగడం సులువే కానీ.. బరువు తగ్గడం మాత్రం కాస్త కష్టం తో కూడుకున్న పని..! ఎండు ద్రాక్షతో బెల్లం నీళ్లు కలిపి తీసుకుంటే బరువు తగ్గుతారు..! అదెలాగో ఇప్పుడు చూద్దాం..!
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో 5 ఎండు ద్రాక్ష వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. ఉదయం ఒక గ్లాస్ నీటిలో 5 గ్రాముల బెల్లం వేయాలి. కొద్దిగా బెల్లం తిని తరువాత బెల్లం ఎండు ద్రాక్ష వేసిన నీటిని తాగాలి. ఇలా ఈ నీటిని తాగడం వలన మీ జీవక్రియను మెరుగు పరుస్తుంది.దాంతో తిన్న ఆహారం త్వరగా జీర్ణమవుతుంది. జీవక్రియ ను పెంచి బరువు తగ్గడానికి సహాయపడుతుంది. కేలరీలు ఖర్చు అయ్యేలా చేస్తుంది.
లేదంటే పెరుగులో ఎండు ద్రాక్ష ను నానబెట్టి భోజనం చేసిన తరువాత.. ఈ పెరుగులో నాన బెట్టిన ద్రాక్ష తింటే బరువు తగ్గుతారు. ఇలా తింటే ఆహారం తిన్న వెంటనే కేలరీలను కరిగించవచ్చు. పెరుగులో నాన బెట్టిన ఎండుద్రాక్ష తింటే ప్రేగు ఆరోగ్యం బాగుంటుంది. ఇంకా జీర్ణ వ్యవస్థ ను మెరుగు పరుస్తుంది. ఇలా ఈ రెండు పద్దతులతో ఏదో ఒకటి పాటించినా త్వరగా బరువు తగ్గుతారు. కెమికల్ ప్రొడక్ట్స్ కంటే ఈ సహజ సిద్ధమైన పద్దతులు పాటిస్తే సైడ్ ఎఫెక్ట్స్ రావు.