Samantha: ఇటీవల కాలంలో సౌత్ అండ్ నార్త్ సినిమా ఇండస్ట్రీలలో సమంత క్రేజీ ప్రాజెక్ట్స్ చేస్తూ చాలా బిజీగా గడుపుతోంది. గత ఏడాది పూర్తి చేసిన శాకుంతలం సినిమా ప్రస్తుతం శరవేగంగా వీఎఫెక్స్ వర్క్ను జరుపుకుంటోంది. ఇక ఇప్పటికే కొత్త సినిమా లను కమిటైన సమంత ఒక్కో సినిమాను కంప్లీట్ చేస్తూ వస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా నయనతార, విలక్షణ నటుడు విజయ్ సేతుపతిలతో కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాను తాజాగా కంప్లీట్ చేసింది.
ఈ సినిమాకు దర్శకుడు నయనతార కాబోయో భర్త విగ్నేష్ శివన్ కావడం విశేషం. ట్రైయాంగిల్ లవ్ స్టోరీగా ఈ సినిమా రూపొందుతుండగా.. తెలుగులో కూడా ఈ సినిమా ను భారీ స్థాయిలో రిలీజ్ చేయనున్నారు. ఇక సమంత ఈ సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తుండటం ఆసక్తికరం. ఆ మధ్య చిత్ర కథ గురించి సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దాన్ని బట్టి చూస్తే తెలుగులో నిన్నే ఇష్టపడ్డాను, నా మనసిస్తారా తరహాలో కథ సాగుతుందని అర్థమవుతోంది. మరి ఇదే గనక నిజమైతే ఖచ్చితంగా విగ్నేష్ శివన్ స్క్రీన్ ప్లే విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.
Samantha: యూనిట్ అందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు.
లేదంటే ఈ తరహా కథలు అన్నీ సక్సెస్ అయిన సందర్భాలు గతంలో లేవనే చెప్పాలి. ఇక కథువాకుల రెండు కాదల్ తెలుగులో కణ్మణి రాంబో ఖతీజాగా విడుదల కాబోతుండగా షూటింగ్ మొత్తం పూర్తైన సందర్భంగా చిత్ర యూనిట్ అందరూ కలిసి సెలబ్రేషన్స్ చేసుకున్నారు. దీనికి సంబంధించిన తాజా ఫొటోలను సమంత తన ఇన్స్టాగ్రాంలో షేర్ చేసింది. ఇక తెలుగులో ఇప్పుడు నటిస్తున్న యశోద సినిమా షూటింగ్ కూడా ఏప్రిల్ నెలలో పూర్తవుతుందని సమాచారం. మే లేదా జూన్ నుంచి జాన్ ఫిలిప్ దర్శకత్వంలో అరేంజ్ మెంట్స్ ఆగ్ లవ్ సినిమా చేయనుంది.