Samantha: సమంత నటించిన తాజా చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధం అయింది. ఇంతకీ ఆ సినిమా మరెదో కాదు `కణ్మణి రాంబో ఖతీజా`. ఇందులో తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి హీరోగా నటించగా.. నయనతార, సమంతలు హీరోయిన్లుగా చేశారు. నయన్ ప్రియుడు విఘ్నేశ్ శివన్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు.
రౌడీ పిక్చర్స్, సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్లపై విగ్నేశ్ శివన్, నయనతార, ఎస్.ఎస్.లలిత్ కుమార్ ఈ మూవీని నిర్మించారు రొమాంటిక్ కామెడీ డ్రామాగా రూపుదిద్దుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 28న తెలుగు, తమిళ్ భాషల్లో విడుదలై మిశ్రమ స్పందన దక్కించుకుంది. కానీ తమిళంలో బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ సినిమా ఫ్లాఫ్ టాక్ తో కూడా సూపర్ కలెక్షన్స్ ని సొంతం చేసుకుని దుమ్ము దులిపేసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇకపోతే కరోనా వచ్చిన తర్వాత థియేటర్స్లో విడుదలైన చిత్రాలన్నీ మళ్లీ ఓటీటీ వేదిగా స్ట్రీమ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే కణ్మణి రాంబో ఖతీజాను ఓటీటీ రిలీజ్కు రెడీ అవుతోంది. తమిళంలో ఈ మూవీ సూపర్ హిట్ అవ్వడంతో ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్స్టార్ కణ్మణి రాంబో ఖతీజా స్ట్రీమింగ్ హక్కులను సాలిడ్ ధరకు సొంతం చేసుకుంది.
అలాగే స్ట్రీమింగ్ డేట్ను కూడా లాక్ చేసింది. హాట్ స్టార్ లో ఈ చిత్రం ఈ నెల 27 నుంచి స్ట్రీమింగ్ కానుంది. కాగా, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో విజయ్ సేతుపతి, సమంత, నయనతారలు పోటీ పడి నటించారు. అనిరుధ్ ఇచ్చిన పాటలు, కొట్టిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఆకట్టుకుంటాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!