Spirit: నేషనల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఉన్న భారీ ప్రాజెక్ట్స్లో `స్పిరిట్` ఒకటి. ప్రభాస్ కెరీర్లో 25వ ప్రాజెక్ట్గా తెరకెక్కబోతున్న ఈ మూవీకి `అర్జున్ రెడ్డి` ఫేమ్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించబోతున్నాడు. గత ఏడాదే అఫీషియల్ అనౌన్మ్మెంట్ రాగా.. భద్రకాళి పిక్చర్స్ బ్యానర్పై భూషణ్ కుమార్ హై బడ్జెట్తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు.
త్వరలోనే ఈ చిత్రం సెట్స్ మీదకు వెళ్లబోతోంది. ఇందులో ప్రభాస్ పోలీస్ ఆఫీసర్గా కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అయితే తాజాగా ఈ సినిమాపై మరో ఇంట్రస్టింగ్ టాక్ వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ సినిమా కోసం టాలీవుడ్ లక్కీ బ్యూటీ రష్మిక మందన్నా, బాలీవుడ్ బిజీ బ్యూటీ కియారా అద్వానీలో పోటీ పడుతున్నారని గత వారం రోజులుగా టాక్ నడుస్తోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
మేకర్స్ ఈ ఇద్దరు హీరోయిన్లలోనే ఒకరిని ప్రభాస్కు జోడీగా ఎంపిక చేయనున్నట్లు వార్తలు కూడా వచ్చాయి. బాలీవుడ్లోనూ ఇదే వార్త హల్ చల్ చేస్తుండటంతో.. కియారా తరపు అధికార ప్రతినిధి స్పందించారు. స్పిరిట్ సినిమా కోసం తమని ఎవరూ ఇంతవరకూ సంప్రదించలేదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సినిమాలో కియారా చేస్తుందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదని ఆయన పేర్కొన్నారు. దీంతో నెట్టింట జరుగుతున్న ప్రచారం పుకార్లే అని తేలిపోయింది. కాగా, సందీప్ రెడ్డి ప్రస్తుతం బాలీవుడ్లో రణబీర్ కపూర్తో `యానిమల్` సినిమా చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ `సలార్`తో బిజీగా ఉన్నారు. ఆయా ప్రాజెక్ట్స్ పూర్తైన వెంటనే స్పిరిట్ సినిమా పట్టాలెక్కనుంది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!