Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి మరికొద్ది రోజుల్లోనే మలేషియాకు పయనం కాబోతున్నారట. అయితే వృత్తిపరంగానే ఆయన అక్కడకు వెళ్లబోతున్నారని తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఇటీవల `ఆచార్య`తో ప్రేక్షకులను పలకరించి బాక్సాఫీస్ వద్ద ఘోరంగా బోల్తా పడిన చిరంజీవి ప్రస్తుతం తన నెక్స్ట్ ప్రాజెక్ట్లపై దృష్టి సారించారు.
ఈయన చేతిలో ఉన్న ప్రాజెక్ట్స్లో `మెగా 154` ఒకటి. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ మూవీ నిర్మితమవుతోంది. ఇందులో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ చిత్రానికి వాల్తేరు వీరయ్య అనే టైటిల్ పరిశీలనలో ఉంది. వాల్తేర్ సముద్ర తీరం నేపథ్యంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ సినిమా రాబోతోంది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇప్పటికే ఈ మూవీకి సంబంధించి కొంత షూటింగ్ పూర్తి కాగా.. తదుపరి షెడ్యూల్కి సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్గా మారింది. అదేంటంటే.. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మలేషియాలో జరగనుందని అంటున్నారు. ఈ షెడ్యూల్ జూన్ 6 నుంచి స్టార్ట్ కాబోతోంది.. ఇందులో సినిమాలోని కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారని సమాచారం.
అందుకారణంగానే చిరంజీవి చిత్ర టీమ్తో కలిసి మలేషియా వెళ్లనున్నట్లు తెలుస్తోంది. కాగా, ఈ చిత్రంలో మాస్ మహారాజ రవితేజ కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. చిరంజీవి తమ్ముడిగా రవితేజ నటించనున్నారని.. మరికొద్ది రోజుల్లో ఆయన షూటింగ్లో జాయిన్ అవ్వనున్నారని కూడా టాక్ నడుస్తోంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!