NBK 107: `అఖండ`తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న నటసింహం బాలకృష్ణ.. తన తదుపరి చిత్రాన్ని `క్రాక్` డైరెక్టర్ గోపీచంద్ మలినేనితో ప్రకటించిన సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రుతి హాసన్ హీరోయిన్గా నటిస్తుంటే.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్రలను పోషిస్తోంది.
అలాగే కన్నడ నటుడు దునియా విజయ్ ఇందులో పవర్ పుల్ విలన్గా కనిపించబోతున్నారు. `ఎన్బీకే 107` వర్కింగ్ టైటిల్తో సెట్స్ మీదకు వెళ్లిన ఈ చిత్రం శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రాబోతున్న ఈ చిత్రానికి `అన్నగారు, `జై బాలయ్య` టైటిల్స్ పరిశీలనలో ఉన్నాయి.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఇదిలా ఉంటే.. ఈ సినిమా విషయంలో నందమూరి ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం బాలయ్యను వెంటాడుతున్న బ్యాడ్ సెంటిమెంట్ అని జోరుగా టాక్ నడుస్తోంది. గత రెండు దశాబ్దాల నుంచీ బాలయ్య బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న దాఖలాలు లేవు. ఒక బ్లాక్ బస్టర్ హిట్ పడితే.. ఆ వెంటనే వరుస ఫ్లాపుల్లో ఆయన కూరుకుపోతుంటారు.
సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, సింహ, లెజెండ్ ఇలా ప్రతి సూపర్ హిట్ తర్వాత.. బాలయ్యకు ప్లాప్స్ ఎదురయ్యాయి. ఇది ఒక బ్యాడ్ సెంటిమెంట్గా మారింది. ఈ నేపథ్యంలోనే `అఖండ` వంటి భారీ హిట్ తర్వాత బాలయ్య నుంచి వస్తున్న `ఎన్బీకే 107`పై ఆ బ్యాడ్ సెంటిమెంట్ ఎఫెక్ట్ ఎక్కడ పడుతుందో అని అభిమానులు టెన్షన్ పడుతున్నారు. మరి ఈ సింటెమెంట్ను గోపీచంద్ మలినేని బ్రేక్ చేసి బాలయ్యకు హిట్ ఇస్తాడా..? లేదా..? అన్నది చూడాలి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!