Pawan Kalyan: చిరంజీవి తమ్ముడిగా ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాణ్ వరుసపెట్టి బ్లాక్ బస్టర్ విషయాలు తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆ సమయంలో “ఖుషి” సినిమా తో ఒక ఊపు ఊపేశాడు. ఏకంగా మెగాస్టార్ చిరంజీవి స్థానాన్ని పవన్ కైవసం చేసు కుంటాడు అనే టాక్ అప్పట్లో వచ్చింది. ఖుషి పవన్ కెరీర్లోనే అతిపెద్ద హిట్ సినిమాగా నిలిచింది. అప్పటికే యూత్ లో తిరుగులేని క్రేజ్ అన్న పవన్ కి ఈ సినిమాతో మరింత క్రేజ్ పెరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు చాలా మంది యువతను ప్రభావితం చేస్తున్న హీరోగా పవన్ నిలిచాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
అయితే “ఖుషి” తరవాత పవన్ నటించిన సినిమా జానీ. ఈ సినిమాకి పవన్ కళ్యాణ్ దర్శకుడు మాత్రమే కాదు సింగర్ ఇంకా కొన్ని ఫైట్లకు కంపోజర్ గా కూడా చేయడం జరిగింది. హాలీవుడ్ సినిమా తరహాలో స్క్రీన్ ప్లే ప్రజెంటేషన్ చేశాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అట్టర్ ఫ్లాప్ అయ్యింది. తెలుగు ప్రేక్షకులకు హాలీవుడ్ రేంజ్ ఫైట్లు… ఆ తరహా వాతావరణం లాంటి క్రియేట్ చేసి.. జానీ మూవీ చూపించగా.. జనాలు రిసీవ్ చేసుకోలేకపోయారు. అయితే ఇప్పటికీ ఈ సినిమా కొంత మంది ప్రముఖులనీ ఆకట్టుకున్నట్లు చెప్పుకొస్తుంటారు.
దీనిలో భాగంగా నటుడు రవి వర్మ.. తాజాగా పవన్ జానీ సినిమా పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జానీ తనకు ఇష్టమైన సినిమా అని తెలిపారు. ఈ సినిమా అప్పట్లో చాలా సార్లు చూడడం జరిగిందని అన్నారు. ఈ క్రమంలో ఒకసారి dvd.. తీసుకొచ్చి ఉద్యోగం చేస్తున్న సమయంలో రాత్రి చూసాను. అది సినిమా చివరిలో పది నిమిషాలు టైం లో డివిడి స్ట్రక్ అయిపోయింది. దీంతో డివిడి ప్లేయర్ మొత్తం బాగా చేయాల్సి వచ్చింది. అయినాగానీ సిడి ప్లే కాలేదు. ఉదయం ఆఫీస్ కి వెళ్లాల్సిన పని ఉంది. అయినా …జానీ సినిమా పై ఇంట్రెస్ట్ కారణంగా కంప్యూటర్ మొత్తం రిపేర్ చేసి చివరాకరికి.. చివరి పది నిమిషాలు సినిమా కూడా చూశాను , అంత ఇష్టం.. పవన్ కళ్యాణ్ నటించిన జానీ సినిమా అంటూ రవి వర్మ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. రవి వర్మ మాత్రమే కాదు రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ కి కూడా పవన్ జానీ ఇష్టమని ఓ ఇంటర్వ్యూలో తెలపడం జరిగింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!