అమరావతి, ఏప్రిల్ 13: టిడిపి అధినేత, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శనివారం ఉదయం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.కేంద్ర ఎన్నకల సంఘాన్ని కల్సేందుకు టిడిపి ప్రతినిధి బృందంతో కలిసి చంద్రబాబు గన్నవరం విమానాశ్రయం నుండి విమాణంలో బయలుదేరి వెళ్లారు
మధ్యాహ్నం 12.30గంటలకు కేంద్ర ఎన్నికల సంఘం తో చంద్రబాబు నాయుడు భేటీ కానున్నారు.
ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికల పోలింగ్ జరిగిన తీరు, ఈవిఎంల ఇబ్బందులపై చంద్రబాబు నాయుడు ఫిర్యాదు చేయనున్నారు.
అలాగే వివిప్యాట్ల లెక్కింపుపై సుప్రీం కోర్టులో రివిజన్ పిటిషన్ దాఖలుపై న్యాయవాదులు, ఇతర ప్రతిపక్ష నాయకులతో చర్చించనున్నారు.
చంద్రబాబు నాయుడు వెంట మంత్రులు కళా వెంకట్రావు, యనమల రామకృష్ణుడు, చినరాజప్ప, పత్తిపాటి పుల్లారావు, నక్కా ఆనంద బాబు, పితాని సత్యనారాయణ, గంటా శ్రీనివాసరావు, అచ్చెన్నాయుడు, కాలవ శ్రీనివాసులు, ఎంపిలు సుజనా చౌదరి, సిఎం రమేష్, గల్లా జయదేవ్, కేశినేని నాని,కొనకళ్ల నారాయణరావు,అశోక్ గజపతి రాజు, రామ్మోహన్ నాయుడు, శివ ప్రసాద్, మాల్యాద్రి,టిడిపి సీనియర్ నేత కంభంపాటి రామ్మోహన్రావు తదితరులు ఢిల్లీకి వెళ్లారు.