Kodali Nani: కేంద్ర మాజీ మంత్రి దగ్గుబాటి పురందేశ్వరి పై గుడివాడ వైసీపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న పురందేశ్వరి గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకుంటున్నారని కొడాలి నాని ఆరోపించారు. అన్న ఎన్టీఆర్ రెండు సార్లు ప్రాతినిధ్యం వహించిన గుడివాడలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవద్దని విజ్ఞప్తి చేశారు. సోమవారం కొడాలి నాని మీడియాతో మాట్లాడుతూ.. సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డి, ఎంపి వల్లభనేని బాలశౌరి ల కృషితో గుడివాడ ప్రజల సుదీర్ఘ సమస్య పరిష్కరించేందుకు గానూ రైల్వే గేట్లపై ఫ్లైఓవర్లు మంజూరు అయ్యాయన్నారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
కేవలం పది మంది వ్యాపారుల ప్రయోజనాల కోసం లక్షలాది మందికి ఉపయోగపడే ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అడ్డుకోవడం దారుణమని అన్నారు కొడాలి నాని. ఫ్లైఓవర్ నిర్మాణం ఆగిపోతే గుడివాడ మీదుగా వెళ్లే రైళ్లను అడ్డుకుంటామని కొడాలి నాని హెచ్చరించారు. ఫ్లైఓవర్ నిర్మాణాన్ని అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు కొడాలి నాని.