Virataparvam: వేణు దర్శకత్వంలో హీరోయిన్ సాయి పల్లవి..దగ్గుబాటి రానా ప్రధాన పాత్రధారులుగా నటించిన సినిమా “విరాట పర్వం”. జూన్ 17 వ తారీకు విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక హైదరాబాద్ శిల్పకళావేదిక లో అభిమానుల మధ్య జరిగింది. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరైన వెంకటేష్.. హీరోయిన్ సాయి పల్లవి పై పొగడ్తల వర్షం కురిపించారు. ఖచ్చితంగా “విరాటపర్వం” బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని తెలిపారు. ఇక రానా గురించి మాట్లాడుతూ ఎటువంటి సినిమా చేసినా గాని పాత్రలో రానా పరకాయ ప్రవేశం చేసేస్తాడు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
చేసే క్యారెక్టర్ లో ఇట్టే ఒదిగిపోతాడు. ఖచ్చితంగా ఈ సినిమాలో రానా క్యారెక్టర్ నీ అందరూ ఇష్టపడతారు. “విరాటపర్వం” సినిమాని నా ఫ్రెండ్ ఇటీవల చూడటం జరిగింది. సినిమా చూసిన తర్వాత అతడు నాతో మాట్లాడుతూ కచ్చితంగా ఈ సినిమాతో హీరోయిన్ సాయి పల్లవికి జాతీయ అవార్డు వస్తుందని తెలిపారు. అంత గొప్పగా సినిమాలో సాయి పల్లవి నటన ఉంది అని తెలియజేశారు. ఇక దర్శకుడు వేణు రూపంలో మరొక గొప్ప మేకర్ టాలీవుడ్ కి దొరకటం జరిగిందని వెంకటేష్ సినిమా యూనిట్ పై పొగడ్తల వర్షం కురిపించారు.
కచ్చితంగా సినిమా విజయం సాధిస్తుందని అందరికీ ఆల్ ది బెస్ట్ చేశారు. ఇదిలా ఉంటే “విరాట పర్వం” సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా రామ్ చరణ్ రావాల్సి ఉండగా… ఫ్లైట్ మిస్ అవడంతో.. చరణ్ రావడంలేదని రానా తెలియజేస్తూ సారీ చెప్పాడు. కాగా చరణ్ ఫంక్షన్ కి ఆలస్యం కావడానికి కారణం పెళ్లి అయి పది సంవత్సరాలు కావడంతో .. ఉపాసనాతో విదేశీ టూర్ వెళ్ళడం జరిగింది. దీంతో తిరుగు ప్రయాణంలో ఫ్లయిట్ మిస్ కావడం జరిగిందట.