Surya: హీరో సూర్య వరుసపెట్టి విజయాలు సాధిస్తున్నారు. రీసెంట్ గా లోకేష్ కనకగారజ్ దర్శకత్వంలో వచ్చిన “విక్రమ్” సూపర్ డూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. కమల్ హాసన్ ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమాలో విజయ్ సేతుపతి, ఫహాధ్ ఫాసిల్.. నటించగా కేవలం ఐదు నిమిషాలలో రోలెక్స్ పాత్రలో సూర్య చేసిన నెగిటివ్ రోల్ సినిమా మొత్తానికి హైలెట్ గా నిలిచింది. కొద్ది నిమిషాలు ఉన్నాగాని “విక్రమ్” లో సూర్య దాటికి థియేటర్ లు దద్దరిల్లాయి. ఇక అంతకు ముందు “జై భీమ్”.. ఆ తర్వాత “ఆకాశమే నీ హద్దురా” సినిమాతో రెండు బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ తన ఖాతాలో వేసుకోవడం జరిగింది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ క్రమంలో “జై భీమ్” ప్రపంచంలోనే అత్యంత పేరుగాంచిన అవార్డ్స్ ఆస్కార్ కి బెస్ట్ ఫిలిమ్స్ లో నామినేట్ కావడం తెలిసిందే. కానీ అవార్డు రాలేకపోయింది. “జై భీమ్” సూర్య కి మంచి పేరు తేచ్చింది. నటన పరంగా విశ్వరూపం చూపించిన సూర్య.. తన అదిరిపోయే పెర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకున్నారు. అంతకుముందే లాక్డౌన్ సమయంలో “ఆకాశమే హద్దురా”.. సినిమాని ఓటిటిలో రిలీజ్ చేసి అదిరిపోయే విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది.
“ఆకాశం హద్దురా” సూర్య కెరీర్లోనే అత్యధిక వ్యూస్ సాధించిన మూవీగా రికార్డ్ క్రియేట్ చేయడం జరిగింది. ఇదిలా ఉంటే ఇప్పుడు ఇదే సినిమాని తమిళంలో తెరకెక్కించిన డైరెక్టర్ సుధా బాలీవుడ్ లో హీరో అక్షయ్ కుమార్ ని పెట్టి చేస్తూ ఉన్నారు. అయితే ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో తాజాగా సూర్య నటించడం జరిగింది. ఈ విషయాన్ని హీరో సూర్య యే సోషల్ మీడియా ద్వారా తెలియజేయడం జరిగింది. అంతమాత్రమే కాదు అక్షయ్ కుమార్ తో దిగిన ఫోటో కూడా పోస్ట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక్క రూపాయి తోనే విమాన ప్రయాణం.. పేదవాళ్ల కలలను తీర్చేదిదే రీతిలో.. సినిమా స్టోరీ చాలా మందిని ఆకట్టుకుంది. అటువంటి స్టోరీని బాలీవుడ్ ప్రేక్షకులు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో చూడాలి.