KGF 2: “కేజిఎఫ్ 2” ఏప్రిల్ 14 వ తారీకు విడుదల అయ్యి ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో దాదాపు వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్ సాధించడం తెలిసిందే. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన “కేజిఎఫ్ 2” విడుదలైన ప్రతి చోట బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడ ఇండస్ట్రీలో “కేజిఎఫ్” తెరకెక్కించగా అక్కడ సూపర్ డూపర్ హిట్ కావడంతో ఆ సినిమా అనేక భాషల్లో డబ్ అయి… అందరినీ ఆకట్టుకుంది. దీంతో “కేజిఎఫ్ 2” పై దేశవ్యాప్తంగా అంచనాలు పెరగగా.. అందరి అంచనాలను అందుకునే రీతిలో ప్రశాంత్ నీల్ తెరకెక్కించారు.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
హీరో యాష్ నీ యాక్షన్ సన్నివేశాలలో అద్భుతరీతిలో చూపించడంతో.. సౌత్ మొదలుకుని నార్త్ ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారు. కొన్ని సన్నివేశాలు రోమాలు నిక్క పొడుచుకునే రీతిలో చిత్రీకరించడంతో.. రిపీట్ ఆడియన్స్ “కేజిఎఫ్ 2″కి బ్రహ్మరథం పట్టారు. అటువంటి ఈ సినిమా పై బాలీవుడ్ బడా నిర్మాత కరణ్ జోహార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాటల్లోనే…”ఇటీవల నేను “కేజిఎఫ్ 2” చూసా. మనస్ఫూర్తిగా చెబుతున్న. ఈ సినిమా నాకు చాలా బాగా నచ్చింది. ఇదే సినిమా గనుక బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు తెరకెక్కిస్తే మాపై ఎన్నో విమర్శలు వచ్చేవి.
విమర్శలతో మమ్మల్ని చంపేసే వాళ్ళు. స్టోరీలను సెలెక్ట్ చేయడం… తెరకెక్కించే విషయంలో సౌత్ ఇండస్ట్రీ కి చెందిన డైరెక్టర్లకు ఉన్న నమ్మకం.. ఇటీవల బాలీవుడ్ ఇండస్ట్రీ లో ఉన్న వాళ్లకు లోపించింది అని అనిపిస్తుంది అంటూ.. కరణ్ జోహార్ “కేజిఎఫ్ 2” పై పొగడ్తల వర్షం కురిపించారు. ఇటీవల చాలా వరకు కరణ్ దక్షిణాది సినిమాలను పొగుడుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో “కేజిఎఫ్ 2” పై ప్రశంసించడం బాలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!