Rajamouli Maheshbabu: రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు సినిమా చేయనున్న సంగతి తెలిసిందే. “బాహుబలి 2”, “RRR” రెండు సినిమాలతో తిరుగులేని క్రేజ్ దేశంలో ప్రపంచంలో సాధించిన జక్కన్న మహేష్ ప్రాజెక్ట్ నీ మరింత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ క్రమంలో బాహుబలి 2, RRR కంటే భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు అట. దాదాపు 800 కోట్ల బడ్జెట్ తో మహేష్- రాజమౌళి సినిమా తెరకెక్కనుందని సమాచారం. ప్రస్తుతం రాజమౌళి స్క్రిప్ట్ వర్క్ పై దృష్టి పెట్టడం జరిగింది. తండ్రి విజయేంద్ర ప్రసాద్ తో స్క్రిప్ట్ వర్క్ చేస్తున్న రాజమౌళికి తాజాగా.. మహేష్ బాబు కొత్త కండిషన్ పెట్టినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్ నడుస్తోంది.
- Read the latest news in Telugu from AP and Telangana’s most trusted news website.
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
విషయంలోకి వెళితే సినిమాకి సంబంధించి హీరోయిన్ విషయంలో… బాలీవుడ్ హీరోయిన్ లను తీసుకోవద్దని.. మహేష్ కొత్త షరతు పెట్టినట్లు వార్తలు వస్తున్నాయి. గతంలో మహేష్ నటించిన సినిమాలలో చాలా వరకు హిందీ హీరోయిన్ లతో నటించడం జరిగింది. దీంతో వాళ్లతో.. విసిగిపోయే సందర్భాలు.. ఉండటంతో మహేష్ ముందు జాగ్రత్తగా.. రాజమౌళికి సూచించినట్లు ఇండస్ట్రీలో లేటెస్ట్ టాక్.
మహేష్ బాబు ఇప్పటి వరకు నటించిన సినిమాలలో చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ లే. రాజకుమారుడు సినిమా లో ప్రీతి జింటా. ఆతర్వాత “టక్కరి దొంగ” లో బిపాషా బసు, లీసా రే, కృతి సనన్, సోనాలి బింద్రే, నమ్రతా శిరోద్కర్, అమృత రావు, కియారా అద్వానీ. దాదాపు చాలా వరకు హిందీ వాళ్లే. ఇటువంటి తరుణంలో.. చాలా ప్రతిష్టాత్మకంగా రాజమౌళి సినిమాని మహేష్ తీసుకోవటంతో.. స్క్రిప్ట్ దశలోనే ముందుగానే షరతులు చెబుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది ప్రారంభం కానున్నట్లు ఫిలింనగర్ టాక్.
Aavesham OTT: డిజిటల్ స్ట్రీమింగ్ డేట్ ను కన్ఫామ్ చేసుకున్న ఆవేశం మూవీ.. ఈ రూ. 150 కోట్ల మూవీ స్ట్రీమింగ్ ఎక్కడంటే..!