CM YS Jagan: ఎపి సీఎం వైఎస్ జగన్ విదేశీ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో ముందుగా ప్లాన్ చేసుకున్న ప్రకారం సీఎం జగన్ సతీసమేతంగా ప్యారిస్ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 28వ తేదీన సీఎం జగన్ ప్యారిస్ బయలుదేరి వెళుతున్నారు. జగన్ పెద్ద కుమార్తె హర్షారెడ్డి అక్కడి ప్రఖ్యాత బిజినెస్ మేనేజ్ మెంట్ స్కూల్ నందు పీజీ (ఎంబీఏ) పూర్తి చేసిన సందర్భంగా స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు జగన్ వెళుతున్నారు. ఇంతకు ముందు సీఎం వైఎస్ జగన్ వరల్డ్ ఎకనమిక్ ఫోరం సదస్సులో పాల్గొనేందుకు దావోస్ వెళ్లిన సమయంలో అది అధికారిక కార్యక్రమం కావడంతో సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయలేదు. దీంతో కోర్టు వెంటనే అనుమతి ఇచ్చింది.
అయితే ఈ సారి సీఎం జగన్ వ్యక్తిగత పర్యటన కావడంతో సీబీఐ విదేశీ పర్యటనకు అనుమతి ఇవ్వవద్దని కోర్టుకు తెలిపింది. సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేసినప్పటికీ సీబీఐ కోర్టు .. పది రోజుల పాటు విదేశీ పర్యటనకు వెళ్లేందుకు అనుమతి మంజూరు చేసింది. అయితే టూర్ ప్రోగ్రామ్ వివరాలను సీబీఐకి, కోర్టుకు అందజేయాలని ఆదేశించింది. కోర్టు అనుమతి నేపథ్యంలో సీఎం జగన్ యథావిధిగా ప్యారిస్ బయలుదేరి వెళ్లనున్నారు. ఈ నెల 28వ తేదీ బయలుదేరి వెళ్లనున్నారు. 29వ తేదీ ప్యారిస్ చేరుకుంటారు. అక్కడ స్నాతకోత్సవ వేడుకల్లో పాల్గొన్న తర్వాత జూలై 2వ తేదీ తిరుగు ప్రయాణం అవుతారు.
CM YS Jagan: భీమవరం పర్యటన పూర్తి చేసుకుని గన్నవరం విమానాశ్రయం వద్ద తిరుగు ప్రయాణం అయిన ప్రధాన మంత్రి నరేంద్ర…
Somu Veerraju: ప్రధాన మంత్రి నరేంద్ర భీమవరం పర్యటన సందర్భంలో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్ శ్రేణులు సిద్ధమైయ్యారు. గన్నవరం విమానాశ్రయం నుండి…
Peanut Rice: వేరుశనగ ఆరోగ్యానికి మంచిదని అందరికీ మంచి తెలిసిందే.. అందుకే పల్లి చెక్కలు, పల్లి ఉండలు, వేరుశనగ పచ్చడి,…
AP Minister RK Roja: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతోత్సవాల సందర్భంగా అజాదీగా అమృత్ ఉత్సవ్ లో…
Race Gurram: 2014వ సంవత్సరంలో డైరెక్టర్ సురేందర్ రెడ్డి(Surender Reddy) దర్శకత్వంలో ఐకాన్ స్టార్ హీరోగా నటించిన "రేసుగుర్రం"( Race…
SSMB28: సూపర్ స్టార్ మహేష్ బాబు(Mahesh Babu) "సర్కారు వారి పాట"(Sarkaru Vari Pata) విజయంతో మంచి జోరు మీద…