Rashmika: నేషనల్ క్రష్ రష్మిక మందన్నా న్యూస్ రిపోర్టర్ గా మారబోతోందట. మరి సినిమాల సంగతేంటి..? అని అయోమయంలో పడకండి. ఎందుకంటే, రష్మిక రియల్లో కాదు.. రీల్లో న్యూస్ రిపోర్టర్గా అలరించబోతోంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం రష్మిక చేతిలో ఉన్న బాలీవుడ్ చిత్రల్లో `యానిమల్` ఒకటి.
అర్జున్ రెడ్డి ఫేం డైరెక్ట్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా నటిస్తుంటే.. ఆయనకు జోడీగా రష్మిక కనిపించబోతోంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అనిల్ కపూర్, బాబీ డియోల్ ఇందులో కీలక పాత్రల్లో మెరవబోతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ఇప్పుడు శరవేగంగా షూటింగ్ను జరుపుకుంటోంది. అయితే తాజాగా ఈ మూవీలోని రష్మిక పాత్రకు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. అదేంటంటే..ఈ మూవీలో రష్మిక న్యూస్ రిపోర్టర్ పాత్రలో నటిస్తోందట. హీరో పాత్రకు ఈమె పాత్రకు ఒక కనెక్షన్ ఉంటుందని, ఆ కనెక్షన్ ఆమె వృత్తికి కూడా లింక్ అయి ఉంటుందని అంటున్నారు.
మరి ఇది ఎంత వరకు నిజమో తెలియాల్సి ఉంది. కాగా, రష్మిక హిందీలో `గుడ్ బై,` `మిషన్ మజ్ను` చిత్రాలు కూడా చేస్తోంది. అలాగే తెలుగులో `పుష్ప 2`, తమిళంలో `వారసుడు`, మలయాళంలో `సీత రామం` చిత్రాల్లోనూ రష్మిక నటిస్తోంది.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!