యాంకర్ అనసూయకి మంచి గుర్తింపు లభించింది అంటే దానికి ప్రధాన కారణం జబర్దస్త్ కామెడీ షో అని అందరికీ తెలుసు. జబర్దస్త్ షోలో యాంకర్ గా అనసూయ మాట్లాడే విధానం వేసుకునే దుస్తులతో ఎంతోమంది హృదయాలను గెలుచుకుని తనకంటూ సెపరేట్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కానీ ఇటీవల అర్థాంతరంగా అనసూయ షో నుండి వెళ్లిపోవడం తెలిసిందే. ఈ క్రమంలో ఆమె ప్లేస్ లో ఎవరు వస్తారు అన్నదానిపై రకరకాల పేర్లు వినబడ్డాయి. కానీ తాజాగా జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించి రిలీజ్ అయిన ప్రోమోలో కొత్త యాంకర్ ఎంట్రీ.. సస్పెన్స్ లో పెట్టి బాడీ వెనక పార్ట్ తో పాటు ఆమె పాదాలు.. చెవికి పోగులు పెట్టుకునే విధానం చూపించి సస్పెన్స్ క్రియేట్ చేసారు.
దీంతో జబర్దస్త్ లేటెస్ట్ ఎపిసోడ్ ప్రోమో చూసి.. ఆమె యాంకర్ మంజుషా అని అందరూ అంటున్నారు. మల్లెమాల యాజమాన్యం.. యాంకర్ మంజుషాకి సరికొత్త అవకాశం ఇచ్చినట్లు.. అనసూయ ప్లేస్ లో ఈ వారంలో కనిపించనున్నట్లు టాక్. “జబర్దస్త్ షో” నుండి అనసూయ మాత్రమే కాదు సుడిగాలి సుదీర్, గెటప్ శీను వంటి వాళ్లు బయటకు వచ్చేయడం జరిగింది. వీళ్లంతా బయటకు రావడం టెలివిజన్ రంగంలో ఒక సంచలనంగా మారింది.
జబర్దస్త్ షో యాజమాన్యం కనీసం తిండి విషయంలో గౌరవం చూపించకుండా ఉండటంతోనే.. వచ్చేసినట్లు కొంతమంది.. జబర్దస్త్ షోలో చేసిన వాళ్లే పలు సోషల్ మీడియా ఇంటర్వ్యూలలో వ్యాఖ్యలు చేశారు. పరిస్థితి ఇలా ఉంటే ఇప్పుడు యాంకర్ అనసూయ ప్లేసులో యాంకర్ మంజుషాన్ని తీసుకొచ్చినట్టు తాజా జబర్దస్త్ షో ప్రోమో వీడియో చూసి జనాలు రకరకాల కామెంట్లు చేస్తున్నారు. అనసూయ మాదిరిగా యాంకర్ మంజుల మెప్పించగలరా అని అంటున్నారు.
Manasichi Choodu: మేము పెళ్లి కాకముందే అటువంటి పని చేశాము.. మనసిచ్చి చూడు సీరియల్ ఫేమ్ కీర్తి బోల్డ్ కామెంట్స్..!