ఏఆర్ కానిస్టేబుల్ డిస్మిస్ వ్యవహారంలో మరో ట్విస్ట్ చోటుచేసుంది. పోలీస్ శాఖపై తప్పుడు కథనాలు ఇస్తొందంటూ ఓ ప్రముఖ పత్రిక కార్యాలయానికి నోటీిసులు అందించారు అనంతపురం ఎస్పీ ఫకీరప్ప. ఇటీవల ఉద్యోగం నుండి డిస్మిస్ అయిన ఎఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం అయిన సంగతి తెలిసిందే. ప్రముఖ దిన పత్రిక ఈనాడు తప్పుడు కథనాలు రాస్తుందంటూ ఎస్పీ ఫకీరప్ప సీరియస్ అయ్యారు. బుధవారం ఈనాడు కార్యాలయానికి వెళ్లి నోటీసులు అందజేశారు. రీసెంట్ గా విధుల నుండి డిస్మిస్ కాబడిన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ పై ఇంతకు ముందే పలు మార్లు సస్పెన్షన్ వేటు పడగా, అతని ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో ఎస్సీ ఫకీరప్ప డిస్మిస్ ఉత్తర్వులు జారీ చేశారుట. అయితే ఏపీ సీఎం జగన్ పర్యటన సందర్భంలో నిరసనగా ప్లకార్డు ప్రదర్శించిన కారణంగానే ప్రకాష్ ను విధుల నుండి డిస్మిస్ చేసినట్లుగా సదరు పత్రికలో వార్తలు రావడంతో వివరణ ఇవ్వాలని కోరుతూ ఈనాడు కార్యాలయానికి వెళ్లిన ఎస్పీ ఫకీరప్ప సిబ్బందికి నోటీసులు ఇచ్చారు.
మరో పక్క విధుల నుండి డిస్మిస్ అయన ఏఆర్ కానిస్టేబుల్ ప్రకాష్ ఫిర్యాదు మేరకు ఎస్పీ ఫకీరప్ప, అడిషనల్ ఎస్పీ,. డీఎస్పీలపై అనంతపురం టౌన్ పీఎస్ లో వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. ఈ వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర సంచలనం అయ్యింది. సర్వత్రా ఈ కేసు ఆసక్తికరంగా మారింది. డీఐజీ నేతృత్వంలో ఈ కేసు విచారణ జరుగుతోంది.