తెలుగు, తమిళ సినీ రంగంలో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్న రష్మిక మందన్న.. రాజకీయ ప్రవేశం చేయనున్నారా.. ? కన్నడ నాట తన అదృష్టం పరీక్షించుకోనున్నారా..? అంటే అవుననే సమాధనం ఇస్తున్నారు ఓ జోతిష్య పండితుడు. కన్నడ కిర్రిక్ పార్టీతో తెరంగ్రేటం చేసిన రష్మిక .. తన అందం, అభినయంతో టాలీవుడ్ లోనూ ప్రేక్షకుల మనసులు దోచుకున్నది. స్టార్ హీరోలందరితో సినిమాలు చేస్తూ టాలీవుడ్ క్రేజీ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు. ‘గీత గోవిందం’ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న రష్మిక ..ఆ తర్వాత ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భీష్మ’ సినిమాల‘తో టాలీవుడ్ లో మంచి క్రేజ్ సంపాదించుకున్నది. ఆ తర్వాత ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా ఫుల్ పాపులర్ అయ్యింది.
అయితే ఆమె రాజకీయ ఎంట్రీపై సెలబ్రిటీ జోతిష్యుడుగా పేరు తెచ్చుకున్న వేణుస్వామి షాకింగ్ కామెంట్స్ చేశారు. గతంలో నాగ చైతన్య, సమంత విడాకులు తీసుకోబోతున్నారు అంటూ ముందే చెప్పి సంచలనం రేపిన ఆయన తాజాగా ఈ స్టార్ హీరోయిన్ కన్నడ నాట రాజకీయాల్లోకి రాబోతున్నది అంటూ చేసిన కామెంట్స్ రాజకీయ, సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారాయి. ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వేణుస్వామి ఈ వ్యాఖ్యలు చేశారు. రష్మిక ఏ పార్టీ నుండి రాజకీయాల్లోకి రానున్నదో కూడా ఆయన చెప్పేశారు. కాంగ్రెస్ పార్టీ నుండి ఆమె రాజకీయాల్లోకి ప్రవేశించి ఎన్నికల్లో పోటీ చేయనున్నదని తెలిపారు. ఆమె జాతకంలో రాజకీయ ప్రవేశం ఉందని అన్నారు. ఇటు టాలీవుడ్, అటు కోలివుడ్ తో సహా బాలివుడ్ లోనూ క్రేజీ ఆఫర్ లు వస్తున్న ఈ తరుణంలో వేణు స్వామి చేసిన వ్యాఖ్యలు సంచలనం అయ్యాయి.
కన్నడ నాట సినీ నటులు రాజకీయాల్లోకి రావడం కొత్తేమీ కాదు. ఇంతకు ముందు రమ్య, సుమలత పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైయ్యారు. అయితే కేరీర్ పరంగా దూసుకుపోతున్న రష్మిక ఈ తరుణంలో రాజకీయ రంగంలోకి ప్రవేశిస్తారా అనేది అనుమానం. దీనిపై అధికారికంగా ఆమె నుండి ఎటువంటి స్పందన లేదు. గతంలో అమె కోసం పూజలు చేశానని చెప్పుకున్న వేణుస్వామి ఇప్పుడు ఆమె రాజకీయ ప్రవేశంపై కామెంట్స్ చేయడం హాట్ టాపిక్ అయ్యింది. ఈ అంశంపై క్లారిటీ రావాలంటే కొంత కాలం ఆగాల్సిందే. ప్రస్తుతం ‘మిషన్ మజ్ను, గుడ్ బై, తలపతి 66 సినిమాల్లో రష్మిక నటిస్తోంది.
సీఎం జగన్ సంకల్పాన్ని ప్రశంసించిన లోక్ సత్తా నేత జయప్రకాశ్ నారాయణ