Ormax : “బాహుబలి 2” వంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ప్రభాస్ కి సరైన హిట్టు ఒకటి కూడా పడలేదు. “బాహుబలి 2” సృష్టించిన రికార్డులతో పాన్ ఇండియా రేంజ్ లో ప్రభాస్ మార్కెట్ విస్తరించింది. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా ప్రభాస్ కి ఒక గుర్తింపు లభించింది. ఈ క్రమంలో “బాహుబలి 2” తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యి.. బాక్సాఫీస్ వద్ద బోల్తా పడ్డాయి. అయినా గాని ప్రభాస్ ఇమేజ్ డామేజ్ కాలేదని తాజా సర్వేలో తేలింది.
“ORMAX INDIA” అనే ప్రముఖ సంస్థాపన ప్రతి నెల సర్వేలు నిర్వహిస్తూ ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఆగస్టు నెలకు సంబంధించి టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ పాపులర్ హీరోలలో నిర్వహించిన సర్వేలో ప్రభాస్ కి మొదటి స్థానం లభించింది. రెండో స్థానంలో ఎన్టీఆర్ మూడో స్థానంలో అల్లు అర్జున్ తర్వాత స్థానాలలో చూస్తే రామ్ చరణ్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, నాని, విజయ్ దేవరకొండ, చిరంజీవి, రవితేజ ఉన్నారు. హీరోయిన్ లలో మొదటి స్థానంలో సమంత నిలిచింది.
ఆ తర్వాత స్థానాలలో కాజల్, అనుష్క, సాయి పల్లవి, పూజా హెగ్డే, కీర్తి సురేష్, తమన్, రష్మిక మందన, కృతి శెట్టి, రాశికన్నా నిలిచారు. ఆగస్టు నెలలో మోస్ట్ పాపులర్ ఇండస్ట్రీకి సంబంధించి హీరోలు మరియు హీరోయిన్ లకి సంబంధించి చేసిన సర్వేలో ఈ ఫలితాలు వచ్చినట్లు “Ormax India” తెలియజేయడం జరిగింది. ఇంకా సినిమాలు విషయానికి వచ్చేసరికి మొదటి స్థానంలో “RRR” తర్వాత స్థానాలు సీతారామం, మేజర్, కార్తికేయ 2, బింబిసార.. నిలిచాయి.
Baahubali: సరికొత్త కథతో ఓటీటీలోకి వచ్చేస్తున్న బాహుబలి.. రిలీజ్ డేట్ ఇదే..!