Mahesh Balakrishna: సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి సెప్టెంబర్ 27వ తారీకు మరణించడం తెలిసిందే. తల్లి మరణించడంతో మహేష్ ఎంతగానో కృంగిపోయాడు. ఓకే ఏడాది లో అన్నయ్య ఇంకా తల్లిని కోల్పోవడంతో మహేష్ కన్నీటి పర్యంతమయ్యారు. ఘట్టమనేని ఫ్యామిలీ సైతం ఇందిరా దేవి మరణం పట్ల ఎంతో బాధపడటం జరిగింది. అయితే ఇంద్రాదేవి భౌతిక గాయానికి చాలామంది ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు ఇంకా రాజకీయ నాయకులు ఆరోజు నివాళులు అర్పించడం జరిగింది. కానీ బాలకృష్ణ మాత్రం హాజరు కాలేదు. సోషల్ మీడియాలో తన సానుభూతిని వ్యక్తపరిచారు.
పరిస్థితి ఇలా ఉంటే అక్టోబర్ 8 వ తారీకు పద్మాలయ స్టూడియోలో ఇందిరా దేవి సంస్మరణ సభకు బాలయ్య బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మహేష్ బాబుతో కొంతసేపు ముచ్చటించారు. దీంతో బాలయ్య మహేష్ ఇందిరా దేవి సంస్మరణ సభకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ సభకు కొంతమంది రాజకీయ నాయకులు ఇంకా సినీ ప్రముఖులు హాజరై సూపర్ స్టార్ కృష్ణని అదేవిధంగా మహేష్ బాబుని పరామర్శించారు. బాలకృష్ణ తో పాటు మురళీకృష్ణ ఇంకా అడవిశేష్, బండ్ల గణేష్, గిరిబాబు, సిపిఐ నారాయణ, దిల్ రాజు, లగడపాటి రాజగోపాల్, దయాకర్ రావు, అక్కినేని సుశాంత్, కేఎల్ నారాయణ, బివిఎస్ఎన్ ప్రసాద్, సి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.
సూపర్ స్టార్ కృష్ణతో కలిసి బాలకృష్ణ భోజనం చేయడం జరిగింది. తల్లి మరణంతో త్రివిక్రమ్ సినిమా షూటింగ్ ఆపేసిన.. మహేష్ త్వరలోనే రెగ్యులర్ షూటింగ్లో మళ్లీ జాయిన్ కానున్నట్లు సమాచారం. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించి ఫస్ట్ షెడ్యూల్ విజయవంతంగా కంప్లీట్ అయింది. మొదటి షెడ్యూల్ పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. త్వరలో స్టార్ట్ కాబోయే సెకండ్ షెడ్యూల్ లో హీరోయిన్ పూజ హెగ్డే తో రొమాంటిక్ సన్నివేశాలు సినిమా యూనిట్ చిత్రీకరించనుంది.