వైసీపీ నాయకుడిపై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకీతో కాల్పులు జరపడం అన్నమయ్య జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ముళ్లగురివాండ్లపల్లి లో సోమవారం రాత్రి ఆ కాల్పుల ఘటన జరిగింది. పీలేరు అగ్రి అడ్వైజరీ కమిటీ చైర్మన్ , వైసీపీ నేత మల్లికార్జున పై గుర్తు తెలియని వ్యక్తులు నాటు తుపాకితో కాల్పులు జరిపి పరారైయ్యారు. ఈ ఘటనలో మల్లికార్జున కాలికి గాయమైంది. తీవ్రంగా గాయపడిన ఆయనను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు.
ఈ సమాచారం తెలియడంతో పీలేరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పాత కక్షలే ఈ కాల్పులకు కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. నిందితులను పట్టుకునేందుకు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ ఘటన జిల్లాలో తీవ్ర కలకలాన్ని రేపింది.