Road Accident: హైదరాబాద్ – విజయవాడ 65వ నెంబర్ జాతీయ రహదారిపై నకిరేకల్లు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం ఇనుపాముల బైపాస్ జంక్షన్ వద్ద కారు అదుపు తప్పి డివైడర్ ను ఢీకొని పల్టీ కొట్టింది. ప్రమాద ధాటికి ఆ వెంటనే కారులో మంటలు చెలరేగాయి. ప్రజలు చూస్తుండగానే పెద్ద ఎత్తున మంటల వ్యాపించాయి. ఇది గమనించిన వాహనదారులు అధికారులు వచ్చే వరకూ వేచి ఉండకుండా వెంటనే స్పందించి కారులో ఉన్న అయిదుగురుని బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు.
ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఫణి కుమార్, అతని తల్లి కరుణ మరణించగా, ఫణికుమార్ భార్య కృష్ణవేణి, ఆయన కుమార్తె, మరొకరు చికిత్స పొందుతున్నారు. బాధితులు అందరూ సూర్యపేట జిల్లా కేంద్రం విద్యానగర్ కాలనీకి చెందిన ఒకే కుటుంబానికి చెందిన వారని సమాచారం. వీరు హైదరాబాద్ నుండి స్వగ్రామానికి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లుగా తెలుస్తొంది. అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజన్ తో అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అయినప్పటికీ కారు మొత్తం దగ్ధం అయ్యింది. సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తల్లి కుమారుడు మృతి చెందడం, మరో ముగ్గురు గాయపడటంతో విద్యానగర్ కాలనీలో విషాదశ్చాయలు అలుముకున్నాయి.
Tragic #RoadAccident: 2 killed, 2 injured, after a #Speeding car in which the 5 mbrs of a family were traveling from #Hyderabad to #Suryapet, went out of control, hits the divider and caught fire after overturned in #Nalgonda dist.#Roadsafety #CarAccident #CarFire #Telangana pic.twitter.com/eySKcqAvrj
— Surya Reddy (@jsuryareddy) December 16, 2022