సూపర్స్టార్ 25వ సినిమా `మహర్షి` ఎంతో ప్రెస్టీజియస్గా రూపొందుతోంది. వంశీ పైడిపల్లి దర్శకుడు. దిల్రాజు. అశ్వినీదత్, పివిపి నిర్మాతలు. సినిమా మే 9న విడుదల కానుంది. నిజానికి దీనికి దిల్రాజు అసలు నిర్మాత. కోర్టు వ్యవహారంతో పివిపి నిర్మాతగా జాయిన్ అయితే.. ఎప్పుడో మహేష్ ఇచ్చిన మాటను పూర్తి చేయడానికి అశ్వినీదత్ను నిర్మాణంలో భాగస్వామిగా చేర్చుకున్నారు. సినిమా సెట్స్కు వెళ్లడానికంటే ముందే దిల్రాజు యాక్టివ్ ప్రొడ్యూసర్ అని.. మిగిలిన వారు కేవలం భాగస్వాములేనని.. లాభాల్లో వాటా మాత్రమే తీసుకోవాలనేది కండీషన్గా పెట్టుకున్నారు. అందుకనే నిర్మాణంతో పాటు బిజినెస్ వ్యవహారంలో కూడా దిల్రాజు కీలకభూమిక పోషించారు. అయితే సీనియర్ నిర్మాత అశ్వినీదత్ ఈ విషయంపై కినుక వహించారు. తనుకు కృష్ణాజిల్లా డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఇచ్చేయాలని పేచీ పెట్టాడట. బిజినెస్ విషయంలో జోక్యం చేసుకోకూడదని అగ్రిమెంట్లో చెప్పినా కూడా ఇప్పుడు ఎందుకు ఇలా చేయడమేమంటూ మహేష్ ఈ విషయంపై అశ్వినీదత్పై సీరియస్ అయ్యాడట. భవిష్యత్లో తనతో ఎప్పుడూ పనిచేయనని చెప్పేశాడట. అంతే కాకుండా కుదిరితే లీగల్ యాక్షన్ తీసుకోవాలని కూడా అనుకుంటున్నాడట. మరి ఈ వ్యవహారం ఎంత వరకు వెళుతుందో చూడాలి.
previous post
next post
Getup Srinu: పవన్ కి సపోర్ట్ చేస్తున్నారు.. మీకు ఇబ్బంది ఉండదా?.. యాంకర్ ప్రశ్నకి గెటప్ శ్రీను దిమ్మ తిరిగే సమాధానం ..!