NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Yuvagalam Padayatra: నారా లోకేష్ కు నోటీసు అందజేసిన పోలీసులు

Yuvagalam Padayatra: నారా లోకేష్ యువగళం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. లోకేష్ తన పాదయాత్రలో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు స్వీకరించేందుకు లోకేష్ నిరాకరించారు. బుధవారం రాత్రి భీమవరం గనుపూడి వంతెన సమీపంలో యువగళం పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

లోకేష్ పాదయాత్ర దారిలో వైసీపీ శ్రేణులు జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తుండటంతో వారి మీదకు టీడీపీ శ్రేణులు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పలువురు పోలీసులతో పాటు  టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు గాయాలైయ్యాయి. శివరామరాజు గుండెపై రాయి బలంగా తగలడంతో రిబ్ ఫ్రాక్చర్ అయ్యింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

కాగా అర్ధరాత్రి సమయంలో బేతపూడి క్యాంప్ సైట్ వద్దకు చేరుకున్న పోలీసులు పలువురు యువగళం పాదయాత్ర వాలంటీర్లు, కిచెన్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. యువగళం పాదయాత్రకు అనుమతి ఇచ్చి అదే రూట్ లో వైసీపీ కార్యకర్తలు కవ్వించు చర్యలు, రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క భీమవరం నియోజకవర్గ పరిధిలోని బేతపూడి క్యాంప్ సైట్ లో ఉన్న నారా లోకేష్ వద్దకు చేరుకున్న పోలీసు అధికారి నోటీసులు అందజేశారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే లోకేష్ పోలీసుల నోటీసులు తీసుకునేందుకు తిరస్కరించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ పలువురు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది పోలీసుల తీరు వ్యవస్థకే చెడ్డపేరు వస్తొందని అన్నారు. వైసీపీ శ్రేణులే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమను కించపరిచేలా ఫ్లెక్సీలు పెడుతున్నప్పుడు వాటిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. తాడేరు వద్ద వైసీపీ శ్రేణులే తమ పై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పాదయాత్రలో శాంతి భద్రతలకు తానెక్కడా విఘాతం కల్గించలేదని అన్నారు. యువగళం వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వరకూ పర్యటించిన ఏ జిల్లాలోనూ జరగని గొడవలు భీమవరంలోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. రెచ్చగొట్టేలా  తాను ఏ వ్యాఖ్యలు చేశానో చెప్పాలన్నారు.

CM YS Jagan: దేశం మొత్తం ఉలిక్కిపడే బిల్లు ఏపీ అసంబ్లీ లో ప్రవేశపెట్టబోతోన్న జగన్ !

Related posts

AP Elections 2024: వైసీపీ అభ్యర్ధి వంగా గీత కార్యాలయాన్ని ముట్టడించిన ఓటర్లు .. ఎందుకో తెలిస్తే అవాక్కవ్వాల్సిందే..!

sharma somaraju

Bomb Threat: ఢిల్లీ ఎయిర్ పోర్టు, ఆసుపత్రులకు బాంబు బెదిరింపులు

sharma somaraju

ఆ మూడు రిజ‌న్లు… చింత‌మ‌నేని గెలుపును నిర్ణ‌యిస్తున్నాయా..?

IPL 2024: ఆర్సీబీ ప్లేయర్ల భార్య‌ల‌ను ఎప్పుడైనా చూశారా.. వారు ఏయే రంగాల్లో ఉన్నారో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

POK: పాక్ ఆక్రమిత కశ్మీర్ లో విధ్వంసం .. భద్రతా దళాలను తరిమితరిమి కొట్టిన ఆందోళనకారులు .. వీడియోస్ వైరల్

sharma somaraju

Ravi Teja: ప‌వ‌న్ క‌ళ్యాణ్ రిజెక్ట్ చేసిన క‌థ‌తో బిగ్ హిట్ కొట్టిన ర‌వితేజ‌.. ఇంత‌కీ ఆ సినిమా ఏదంటే?

kavya N

Kona Venkat: సినీ రచయిత కోన వెంకట్ పై బాపట్లలో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు.. ఎందుకంటే ..?

sharma somaraju

Kriti Sanon: ఆ క్వాలిటీస్ ఉంటేనే పెళ్లి చేసుకుంటా.. కాబోయే భ‌ర్త‌పై కృతి స‌న‌న్ ఓపెన్ కామెంట్స్‌!

kavya N

CM Revanth Reddy: విద్యార్ధులతో ఫుట్ బాల్ ఆడిన సీఎం రేవంత్ .. వీడియో వైరల్

sharma somaraju

Aparichithudu: మ‌ళ్లీ వ‌స్తున్న అప‌రిచితుడు.. ఎన్ని థియేట‌ర్స్ లో విడుద‌ల‌వుతుందో తెలిస్తే మ‌తిపోతుంది!

kavya N

జగన్ టీమ్‌లో ఈ పెద్ద లీడర్లు గెలవడం కష్టమేనా ?

విజయమ్మతో చివరి బాణం వదిలిన షర్మిల.. ?

మెగా ఫ్యామిలీని రెండు ముక్క‌లు చెక్క‌లు చేసిందెవ‌రు..?

అల్లు అర్జున్‌ ప్రచారం.. బాబుకి ఫ్రస్టేషన్ ..?

పిఠాపురానికి జ‌గ‌న్ సంచ‌ల‌న హామీ.. ప‌వ‌న్ కు చెక్ పెట్టిన‌ట్టేనా?