NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

Yuvagalam Padayatra: నారా లోకేష్ కు నోటీసు అందజేసిన పోలీసులు

Yuvagalam Padayatra: నారా లోకేష్ యువగళం పాదయాత్ర పశ్చిమ గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. లోకేష్ తన పాదయాత్రలో ప్రభుత్వంపై, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు, విమర్శలు చేస్తున్న నేపథ్యంలో రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారంటూ పోలీసులు నోటీసులు జారీ చేశారు. అయితే నోటీసులు స్వీకరించేందుకు లోకేష్ నిరాకరించారు. బుధవారం రాత్రి భీమవరం గనుపూడి వంతెన సమీపంలో యువగళం పాదయాత్రలో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.

 

లోకేష్ పాదయాత్ర దారిలో వైసీపీ శ్రేణులు జెండాలు ఊపుతూ నినాదాలు చేస్తుండటంతో వారి మీదకు టీడీపీ శ్రేణులు వెళ్లారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇరువర్గాలు రాళ్లు రువ్వుకోవడంతో పలువురు వైసీపీ, టీడీపీ కార్యకర్తలు గాయపడ్డారు. పలువురు పోలీసులతో పాటు  టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు గాయాలైయ్యాయి. శివరామరాజు గుండెపై రాయి బలంగా తగలడంతో రిబ్ ఫ్రాక్చర్ అయ్యింది. గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టి పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.

కాగా అర్ధరాత్రి సమయంలో బేతపూడి క్యాంప్ సైట్ వద్దకు చేరుకున్న పోలీసులు పలువురు యువగళం పాదయాత్ర వాలంటీర్లు, కిచెన్ సిబ్బందిని అదుపులోకి తీసుకున్నారు. యువగళం పాదయాత్రకు అనుమతి ఇచ్చి అదే రూట్ లో వైసీపీ కార్యకర్తలు కవ్వించు చర్యలు, రాళ్ల దాడి చేస్తే పోలీసులు ప్రేక్షకపాత్ర వహిస్తున్నారంటూ టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరో పక్క భీమవరం నియోజకవర్గ పరిధిలోని బేతపూడి క్యాంప్ సైట్ లో ఉన్న నారా లోకేష్ వద్దకు చేరుకున్న పోలీసు అధికారి నోటీసులు అందజేశారు. పాదయాత్రలో రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ ఆయనకు నోటీసులు ఇచ్చారు. అయితే లోకేష్ పోలీసుల నోటీసులు తీసుకునేందుకు తిరస్కరించారు.

ఈ సందర్భంగా నారా లోకేష్ పలువురు పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత మంది పోలీసుల తీరు వ్యవస్థకే చెడ్డపేరు వస్తొందని అన్నారు. వైసీపీ శ్రేణులే కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. తమను కించపరిచేలా ఫ్లెక్సీలు పెడుతున్నప్పుడు వాటిని ఎలా అనుమతించారని ప్రశ్నించారు. తాడేరు వద్ద వైసీపీ శ్రేణులే తమ పై రాళ్ల దాడికి పాల్పడ్డారని ఆరోపించారు. పాదయాత్రలో శాంతి భద్రతలకు తానెక్కడా విఘాతం కల్గించలేదని అన్నారు. యువగళం వాలంటీర్లను పోలీసులు అదుపులోకి తీసుకోవడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత వరకూ పర్యటించిన ఏ జిల్లాలోనూ జరగని గొడవలు భీమవరంలోనే ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. రెచ్చగొట్టేలా  తాను ఏ వ్యాఖ్యలు చేశానో చెప్పాలన్నారు.

CM YS Jagan: దేశం మొత్తం ఉలిక్కిపడే బిల్లు ఏపీ అసంబ్లీ లో ప్రవేశపెట్టబోతోన్న జగన్ !

Related posts

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N