అమరావతి: టిడిపి నియోజకవర్గాల వారీ సమీక్షలు కొనసాగిస్తే కౌంటింగ్కు ముందే కొంప కొల్లేరు అవుతుందని గ్రహించి చంద్రబాబు సమీక్షలను రద్దు చేశారట అంటూ వైసిపి రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు. బుధవారం విజయసియరెడ్డి ట్విట్టర్ వేదికగా టిడిపి సమీక్షలను విమర్శించారు.
‘సొంత పార్టీ నేతలే ఎక్కడికక్కడ వెన్నుపోటు పొడిచారంటూ ఎన్నికల సమీక్షల్లో తమ్ముళ్లు బావురుమంటుంటే వారిని ఎలా ఓదార్చాలో తెలియక బాబు బిక్కచచ్చిపోతున్నారట. పార్టీ శ్రేణుల్లో ధైర్యం నూరిపోయడం సంగతి సరే, సమీక్షలను ఇలాగే కొనసాగిస్తే కౌంటింగ్కు ముందే కొంప కొల్లేరని గ్రహించి రద్దు చేశారట’ అంటూ విజయసాయి ఎద్దేవా చేశారు.