అమరావతి: టిడిపి అధినేత చంద్రబాబు చాలా రోజుల తరువాత ఒక ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు హైదరాబాదు బయలుదేరారు. ఎన్నికల తేదీ ప్రకటించిన నాటి నుండి ఆ కార్యక్రమాలతో తీరిక లేకుండా గడిపిన చంద్రబాబు నేడు హైదరాబాదు బయలు దేరి వేళుతున్నారు.
రామోజీ ఫిలిం సిటీలో జరిగే ప్రైవేటు కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనేందుకు ఉదయం 10.30గంటలకు హెలికాఫ్టర్లో బయలుదేరారు. 11.45గంటలకు రామోజీ ఫిలిం సిటీకి చేరుకుంటారు. మధ్యాహ్నం 1.30గంటలకు తిరుగు ప్రయాణమై 2.45గంటలకు అమరావతికి చేరుకుంటారు. సిఎం చంద్రబాబు పర్యటన వివరాలను ఆయన పిఎ తెలంగాణ పోలీస్ ఉన్నతాధికారులకు ఫాక్స్ ద్వారా తెలియజేశారు,
మధ్యాహ్నం 12గంటల నుండి 1.30గంటల వరకూ చంద్రబాబు కార్యక్రమాలను రిజర్వుడ్గా చూపారు.
ప్రస్తుతం దేశ రాజకీయాల్లో క్రియాశీలక భూమికను పోషిస్తున్న చంద్రబాబు రామోజీ ఫిలిం సిటీలో ప్రముఖ దినపత్రిక ఈనాడు అధినేత రామోజీరావుతో కూడా భేటీ కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. వారి మధ్య ప్రస్తుత కేంద్ర, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై కూడా వారు చర్చించే అవకాశం ఉందని భావిస్తున్నారు.