Ambati Rayudu: ప్రముఖ క్రికెటర్ అంబటి తిరుపతి రాయుడు వైసీపీకి బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. రాబోయే ఎన్నికల్లో గుంటూరు పార్లమెంట్ స్థానం నుండి వైసీపీ నుండి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న అంబటి రాయుడు ఇవేళ కీలక ప్రకటన చేశారు. పార్టీని వీడుతున్నట్లు ప్రకటించి వైసీపీకి షాక్ ఇచ్చారు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. రాజకీయాలకు కొంత కాలం దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నా. త్వరలో తదుపరి కార్యచరణ ప్రకటిస్తా అని తెలిపారు. గత నెల 28వ తేదీనే ఆయన సీఎం వైఎస్ జగన సమక్షంలో పార్టీలో చేరిన సంగతి తెలిసిందే.
పార్టీలో చేరిన పది రోజుల వ్యవధిలోనే అంబటి రాయుడు ఈ నిర్ణయం తీసుకోవడం సర్వత్రా హాట్ టాపిక్ అయ్యింది. గత కొంత కాలంగా గుంటూరు జిల్లాలో పర్యటిస్తూ, వైసీపీకి దగ్గరగా వ్యవహరిస్తూ వచ్చిన అంబటి తిరుపతి రాయుడు అధికారికంగా పార్టీ తీర్ధం పుచ్చుకోవడంతో గుంటూరు లోక్ సభ స్థానం నుండి పోటీ చేయడం పక్కా అని అందరూ అనుకున్నారు. వైసీపీలో చేరిన రోజున .. అంబటి రాయుడు మీడియాతో మాట్లాడుతూ .. రాజకీయాల్లో తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని చెప్పారు. సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరడం సంతోషంగా ఉందని అన్నారు.
మొదటి నుండి తనకు జగన్ మీద మంచి అభిప్రాయం ఉందని..ఆయన కులమతాలు, రాజకీయాలతో పని లేకుండా పారదర్శకంగా పాలన చేస్తున్నారని ప్రశంసించారు. అందుకే ఆయనకు మద్దతుగా గతంలో ట్వీట్లు పెట్టినట్లు పేర్కొన్నారు. తన ప్రాంత ప్రజల సంక్షేమం కోసం పని చేస్తానని అంబటి రాయుడు తెలిపారు. సంక్షేమ పథకాలపై చంద్రబాబు, పవన్ కళ్యాణ్ గతంలో చాలా ఆరోపణలు చేశారనీ..ఇప్పుడు వారే అంతకంటే ఎక్కువ ఇస్తామని ఎలా చెప్తారని రాయుడు ప్రశ్నించారు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారన్నారు.
ఇలా తన అభిప్రాయాలను వ్యక్తం చేసిన అంబటి రాయుడు నేడు వైసీపీని వీడుతున్నట్లు ప్రకటించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశం అయ్యింది. తొలుత గుంటూరు లోక్ సభ స్థానంపై అంబటి రాయుడికి హామీ ఇచ్చినప్పటికీ తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఆ స్థానం నుండి నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులును పోటీ చేయాలని జగన్ సూచించినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే లావు తాను నరసరావుపేట నుండి అయితే పోటీ చేస్తానని, గుంటూరు నుండి అయితే పోటీ చేయనని చెప్పినట్లుగా తెలుస్తొంది. నరసరావుపేట లోక్ సభ స్థానం ఈ సారి బీసీ నేతకు ఇవ్వాలన్న ఆలోచనలో పార్టీ హైకమాండ్ ఉన్నట్లు సమాచారం. ఆ క్రమంలో శ్రీకృష్ణదేవరాయలును గుంటూరు లోక్ సభ స్థానం పోటీ చేయాలని సూచించినట్లు చెబుతున్నారు.
రాజకీయాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించానని చెప్పిన అంబటి రాయుడు ఆకస్మికంగా యూటర్న్ తీసుకోవడంపై రకరకాలుగా ఊహాగానాలు వస్తున్నాయి. అంబటి రాయుడు పార్టీ కండువా కప్పుకున్న తర్వాత గుంటూరు నియోజకవర్గంలో పర్యటించలేదు. పార్టీలో చేరిన రోజునే హైదరాబాద్ వెళ్లిపోయారు. పది రోజులుగా అక్కడే ఉన్నట్లు తెలుస్తొంది. ఈ వేళ ట్విట్టర్ వేదికగా కీలక నిర్ణయాన్ని వెలువరించారు. దీనిపై వైసీపీ నేతలు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.
Kesineni Nani: కీలక నిర్ణయం తీసుకున్న టీడీపీ ఎంపీ కేశినేని నాని .. బాబుకు బిగ్ ఝలక్
This is to inform everyone that I have decided to quit the YSRCP Party and stay out of politics for a little while. Further action will be conveyed in due course of time.
Thank You.
— ATR (@RayuduAmbati) January 6, 2024