Samantha: ఒకప్పుడు బాలనటుడిగా మెప్పించిన తేజా సజ్జా.. “హను మాన్” సినిమాతో హీరోగా ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధం కావడం జరిగింది. తేజా సజ్జా బాల నటుడిగా అనేక సినిమాలలో నటించాడు. చిరంజీవి, విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్, జగపతిబాబు, ప్రభాస్, ఎన్టీఆర్, నాగార్జున సినిమాలలో నటించారు. 1998 నుండి 2006 వరకు బాల నటుడిగా అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు హీరోగా తేజా సజ్జా నటించిన “హనుమాన్” ఈనెల 12వ తారీకు విడుదల కానుంది. భారతీయ పురాణాల ఇతిహాసాల ఆధారంగా ఈ సినిమాని సూపర్ హీరోస్ నేపథ్యంలో చిత్రీకరించారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. జనవరి ఏడవ తారీఖు ఆదివారం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.
ఈ కార్యక్రమానికి చిరంజీవి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఇదిలా ఉంటే తాజాగా తేజా సజ్జా మాట్లాడుతూ హీరోయిన్ సమంతపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. హనుమాన్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా యాంకర్ 2019లో హీరోగా ఎంట్రీ ఇవ్వక ముందు “ఓ బేబీ” సినిమా ఎందుకు చేశారు అని ప్రశ్నించడం జరిగింది. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందు సమంతతో ఎందుకు ఒప్పుకున్నారని ప్రశ్నించగా తేజ సమాధానం ఇస్తూ..”అప్పట్లో నాకు హీరోగా అవకాశాలు ఇవ్వటానికి ఎవరు కూడా ముందుకు రాలేదు. దీంతో ఆ సమయంలో నాకు అవకాశం వచ్చింది. ఈ స్టోరీ మొత్తం నా క్యారెక్టర్ చుట్టూనే తిరుగుతుంది కాబట్టి ఒప్పుకున్నాను.
ఆ సినిమా షూటింగ్ లో సమంత గారు నాకు చాలా సహాయం చేశారు. డైరెక్టర్ నందిని రెడ్డికి చెప్పి మరీ కొన్ని సన్నివేశాలు పెట్టించారు. “ఓ బేబీ” సినిమాలో సమంత గారు నాకు ఇచ్చిన ప్రోత్సాహం నేను ఎప్పటికీ మర్చిపోలేను అంటూ తేజా సజ్జా కీలక వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఈ కామెంట్స్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారాయి. జనవరి 12వ తారీకు “హను మాన్” విడుదల కాబోతోంది. ఇక అదే రోజు మహేష్ బాబు నటించిన “గుంటూరు కారం” కూడా విడుదల అవుతున్న నేపథ్యంలో.. మంచి పోటీ నెలకొంది.
Shyamala: అప్పుడు పవనిజం.. ఇప్పుడు జగనిజం… ఏంటి శ్యామల ఇది..?