Bilkis Bano Case: బిల్కిస్ బానో కేసులో సుప్రీం కోర్టు సంచలన తీర్పు వెల్లడించింది. కేసులో 11 మంది దోషులకు గుజరాత్ ప్రభుత్వం ప్రసాదించినన క్షమాబిక్షను సుప్రీం కోర్టు రద్దు చేసింది. క్షమాబిక్ష ఉత్తర్వులు జారీ చేసే అధికారం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని తేల్చి చెప్పింది సుప్రీం ధర్మాసనం. ఈ అధికారం మహారాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుందని పేర్కొంది.
దోషికి సంబంధించి విచారణ, జైలు శిక్ష విధింపు ఎక్కడైతే జరిగిందో అక్కడే క్షమాబిక్ష పిటిషన్ల పై నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. ఈ మేరకు జస్టిస్ నాగరత్న, జస్టిల్ ఉజ్జల్ భూయాన్ కూడిన ద్విసభ్య ధర్మాసనం సోమవారం తీర్పు వెలువరించింది. క్షమాబిక్ష నిర్ణయం పై పునరాలోచన చేయాలని గతంలో తాము ఇచ్చిన ఆదేశాలు చెల్లవని స్పష్టం చేసింది. అనేక విషయాలను బహిర్గతం చేయకుండా ఆ ఉత్తర్వులు సంపాదించుకున్నారని పేర్కొంది ధర్మాసనం.
2002 గుజరాత్ అల్లర్ల సమయంలో 21ఏళ్ల బిల్కిస్ బానోపై అత్యాచారం జరిగింది. అయిదు నెలల గర్బిణీ అయిన ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు దుండగులు. అల్లర్లలో మూడేళ్ల కుమార్తె సహా బిల్కిస్ కుటుంబానికి చెందిన ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అత్యాచార ఘటనలో దోషులుగా తేల్చిన 11 మందికి జీవిత ఖైదు శిక్ష పడింది. కాగా.. గుజరాత్ సర్కార్ గత 2024 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా దోషులను విడుదల చేసింది.
దోషులకు క్షమాభిక్ష ప్రసాదించి ఆగస్టు 15న విడుదల చేసింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ బాధితుల తరపున సుప్రీం కోర్టును ఆశ్రయించగా, విచారణ సందర్భంగా గుజరాత్ ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా తప్బుబట్టింది. కేసు తీవ్రత ఎంతో పట్టించుకోకుండా 11 మంది దోషులకు ఉపశమనం కల్పించడాన్ని ధర్మాసనం ఆక్షేపించింది. క్షమాభిక్ష ప్రసాదించే సమయంలో దోషుల నేర తీవ్రత పరిశీలించాలని స్పష్టం చేశారు.
Kesineni Sweta: విజయవాడ టీడీపీకి మరో ఝలక్ .. తండ్రి బాటలో తనయ