Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి “హను మాన్” ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. మైథిలాజికల్ పాయింట్ తో తెరకెక్కిన ఈ చిత్రనికి ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. జనవరి 12వ తారీకు ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ నేను ఈ కార్యక్రమానికి రావడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అందులో ప్రధానంగా నా ఇష్ట దైవం హనుమంతుడికి సంబంధించిన కంటెంట్ తో ఈ సినిమా తెరకెక్కటం అని అన్నారు. ఇక హీరో తేజా సజ్జా.. నా ముందు డైపర్లు వేసుకునే స్థాయి నుంచి.. డయాస్ పైన హీరోగా మాట్లాడే స్థాయికి అంచలంచెలుగా ఎదుగుతూ వచ్చాడు. అతని కోసమే వచ్చాను అన్నది రెండో కారణం. ట్రైలర్ నన్నెంతగానో ఆకట్టుగుంది.
ఈ క్రమంలో డైరెక్టర్ ప్రశాంత్ వర్మ పనితనం నుంచి ఈ కార్యక్రమానికి వచ్చినట్లు మూడో కారణమని అన్నారు. హనుమాన్ ఆశీస్సులు కారణంగానే నాకు ఒక లక్ష్య సాధన… నిబద్ధత అలవడ్డాయని భావిస్తూ ఉంటాను. అలాంటి హనుమతో నాకు ఒక మంచి అనుబంధం ఉంది. ఆయనను నమ్ముకోవడం వల్ల నేను ఈ స్థాయికి వచ్చాను. నేను ఏడవ తరగతి చదువుతుండగా హనుమంతుడి గుడికి వెళ్లి వస్తుండేవాడిని. ఆ తరువాత బాపట్లలో ఎనిమిదవ తరగతి చదువుతూ ఉండగా హనుమంతుడు గుడికి.. ప్రసాదం కోసం వెళ్లేవాడిని. అలా ఆయనపై నాకు భక్తి భావం పెరిగిపోయింది. ఆ తర్వాత మొగల్తూరు వెళ్ళగా ఒక హనుమాన్ క్యాలెండర్ నా చేతికి వచ్చింది. ఈ రోజున ఆ క్యాలెండర్ మా ఇంట్లో ఉంది. దానిని ఫ్రేమ్ కట్టించి పూజిస్తూనే ఉన్నాను.
ఇక పదవ తరగతి చదువుతున్నప్పుడు మా నాన్నగారికి.. ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అయింది. అక్కడికి వెళ్లడం మా ఫాదర్ కి ఇష్టం లేదు. ఆయనకి దేవుళ్లపై కూడా నమ్మకం ఉండేది కాదు. అయినా హనుమాన్ చాలీసా చదవమని చెప్పాను. అలా చేస్తే అనుకున్న చోటికి ట్రాన్స్ ఫర్ అవుతుందని అన్నాను. నా మాట నమ్మి నాన్న అలాగే చేశారు.. అలాగే జరిగింది. నాకు హనుమాన్ పరిచయం చేసిన మా పెద్దబ్బాయినే నా గురువు అని మా నాన్నగారు అందరితో చెప్పేవారు అంటూ అప్పటి అనుభవాలను గుర్తు చేసుకుని..హను మాన్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చిరంజీవి ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు.
Mogali Rekulu: మెగా ఫ్యామిలీతో సందడి చేసిన మొగలిరేకులు ఆర్కే నాయుడు.. వైరల్ అవుతున్న ఫొటోస్..!