Chandrababu: ఏపీ నూతన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు మరో నాలుగైదు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనుండటంతో ఐపీఎస్, ఐఏఎస్ లు ఆయనను కలిసేందుకు వస్తున్నారు. ఉండవల్లి లోని ఆయన నివాసానికి అధికారులు క్యూ కడుతున్నారు. ఇప్పటికే అనేక మంది ఉన్నతాధికారులు చంద్రబాబును కలిసి అభినందనలు తెలియచేశారు.
అధికారులతో పాటు పార్టీ నేతలు కూడా పెద్ద ఎత్తున తరలివస్తుండంటో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ సర్కార్ లో ఆ పార్టీ నేతలకు అంటకాగిన అధికారులు మర్యాద పూర్వక భేటీ పేరుతో వస్తుండంటో వారిని కలిసేందుకు చంద్రబాబు విముఖత వ్యక్తం చేస్తున్నారుట. చంద్రబాబును కలిసేందుకు పలువురు అధికారులు ప్రయత్నిస్తుండగా, టీడీపీ అధిష్టానం తిరస్కరిస్తొంది. వైసీపీ ప్రభుత్వంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా పని చేసిన సీనియర్ ఐపీఎస్ అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులును గేటు వద్ద నుండి సెక్యూరిటీ సిబ్బంది వెనక్కు పంపించేసింది. జగన్ తో అంటకాగి .. కర్టసీ మీటింగ్ పేరుతో వచ్చే వారికి నిర్మోహమాటంగా టీడీపీ పెద్దలు నో చెబుతున్నారు.
మరో కీలక అధికారి కొల్లు రఘురామిరెడ్డి సైతం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నం చేశారు. కొల్లి రఘురామిరెడ్డికి అన్ని శాఖల నుండి తప్పిస్తూ డీజీ ఆఫీసులో రిపోర్టు చేయాలని నిన్న అదేశాలు అందాయి. చంద్రబాబును కలిసేందుకు ఆయన ఈ రోజు అపాయింట్మెంట్ కోసం ప్రయత్నించగా తిరస్కరించినట్లు తెలుస్తొంది. వైసీపీ అధికారంలో ఉండగా, ఆ పార్టీ నేతలకు అనుకూలంగా వ్యవహరించి టీడీపీ నేతలను తీవ్రంగా ఇబ్బందులకు గురి చేసిన అధికారులను చంద్రబాబు దగ్గరకు రానిచ్చే అవకాశం లేదని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.