హైదరాబాద్: బిజెపి సీనియర్ నేత బండారు దత్తాత్రేయ తెలంగాణ రాజకీయాలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజామాబాద్లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కరీంనగర్లో బి వినోద్, నిజామాబాద్లో కల్వకుంట్ల కవిత ఓటమితో రాష్ట్రంలో టిఆర్ఎస్ పతనం ఆరంభమైందని అన్నారు.
తెలంగాణలో త్వరలో కమలం వికసిస్తుందని దత్తాత్రేయ జోస్యం చెప్పారు. టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నుండి మరి కొంత మంది లోక్సభ సభ్యులు త్వరలో బిజెపిలో చేరనున్నారని దత్తాత్రేయ తెలిపారు. టిఆర్ఎస్ నేత డి శ్రీనివాస్తో పాటు చాలా మంది బిజెపిలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని దత్తాత్రేయ వెల్లడించారు. తెలంగాణలో టిఆర్ఎస్కు బిజెపియే ప్రత్యామ్నాయంగా మారుతోందని దత్తాత్రేయ అన్నారు. కేంద్ర ప్రభుత్వం పేదల సంక్షేమ పథకాలకు నిధులు కేటాయిస్తుంటే వాటిని ప్రాజెక్టుల కోసం వాడుతున్నారని దత్తాత్రేయ ఆరోపించారు.