అమరావతి: వైసీపీ నేత విజయసాయిరెడ్డి, టీడీపీ నేత బుద్ధా వెంకన్న మధ్య ట్విట్టర్ వార్ కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియకుండానే ప్రజలకు నవరత్నాయిల్ రాసారా శకుని మామా? అంటూ టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డిపై ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పించారు. ‘‘అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే మోదీ మెడలు వంచుతాం, కేంద్రాన్ని కడిగేసి రాష్ట్ర ఖజానా నింపుతాం అన్నారుగా నువ్వు, మీ తుగ్లక్ (జగన్) గుర్తుందా? తీరా మీకు 22 ఎంపీలని ఇస్తే రాష్ట్రం కోసం పోరాడాల్సింది మానేసి మీ కేసుల మాఫీ కోసం వంగి వంగి దండాలు పెడుతూ ఆంధ్రప్రదేశ్ హక్కుల్ని కేంద్రానికి తాకట్టు పెట్టేశారు కదా శకుని మామా! దానికితోడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితీ, అప్పులూ అంటూ మంగళారం కబుర్లొకటి!” అంటూ సెటైర్ వేశారు. మడమ తిప్పాం, మాట తప్పాం అని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాదు, “మహామేత హయాంలో చేసిన అప్పులు, చంద్రబాబు సృష్టించిన సంపదపై నేను చర్చకు సిద్ధం, మరి నువ్వు సిద్ధమా శకుని మామా?” అంటూ సవాల్ విసిరారు.
రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి తెలియకుండానే రాష్ట్ర ప్రజలకు నవరత్నాయిల్ రాసారా శకుని @VSReddy_MP మామా? అత్యధిక పార్లమెంట్ సీట్లు గెలిపిస్తే మోదీ మెడలు వంచుతాం, కేంద్రాన్ని కడిగేసి రాష్ట్ర ఖజానా నింపుతాం అన్నారుగా నువ్వు, మీ తుగ్లక్ @ysjagan గుర్తుందా?
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) October 21, 2019
మడమ తిప్పామ్, మాట మార్చామ్ అని ఒప్పుకొని రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెబితే, మీ మహమేత హయాంలో చేసిన అప్పులు, చంద్రబాబుగారు చేసిన అప్పులు సృష్టించిన సంపదపై నీతో చర్చకు నేను సిద్ధం. మరి నువ్వు సిద్ధమా శకుని మామా ?
— Budda Venkanna #StayHomeSaveLives (@BuddaVenkanna) October 21, 2019