ముంబాయి, జనవరి 10: నోరు జారి నందుకు ఇద్దరు భారత క్రికెటర్లు రెండు మ్యాచ్ల నిషేధింంచాలంటూ సిఫార్సుకు గురైయ్యారు. ఇటీవల కెఎల్ రాహుల్, హార్ధిక పాండ్యలు కలసి కాఫీ విత్ కరణ్ అనే టివి షోలో కనిపించి మహిళల గురించి, తమ తల్లిదండ్రులతో ఎలా ఉంటారు అన్న విషయాలను ప్రస్తావించారు.
భారత క్రికెట్ కంట్రోలు బోర్డు క్రికెటర్ల రోజువారీ కార్యకలాపాలను పర్యవేక్షించేందుకు నియమించిన కమిటీ చీఫ్ వినోద్రాయ్ క్రమశిక్షణా చర్యలలో భాగంగా రెండు వన్డేల నిషేధాన్ని బోర్డుకు సిఫార్సు చేసింది. ఈ విషయాన్ని బోర్డు ప్యానల్ డయానా ఎడుల్జీ దీనిపైన తుది నిర్ణయం తీసుకోనున్నారు.
కరణ్ జోహార్ ద్వారా ప్రసారం అయిన టివి కార్యక్రమంలో పాండ్యా వెల్లడించిన అంశాలు వివాదాస్పదమయ్యాయి. దీనిపై నెట్జన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ షోలో పాల్గొన్న క్రికెటర్లపై నిషేధం అంశం బోర్డు చేతిలో ఉంది.
తన వ్యాఖ్యలపై ట్విట్టర్ ద్వారా ప్రజలకు క్షమాపణ చెప్పడంతోపాటు బోర్డు కు పాండ్య వివరణ లేఖ రాసాడు.
previous post
next post