(న్యూస్ ఆర్బిట్ డెస్క్)
కడప విమానాశ్రయంలో ట్రూ జెట్ విమానానికి త్రుటిలో తప్పిన ప్రమాదం. కడప నుండి విజయవాడకు ప్రయాణికులతో వెళుతున్న ట్రూజెట్ విమానం.. టేకాఫ్ అయిన వెంటనే ఎదురుగా పక్షి అడ్డు తగలడంతో చాకచక్యంగా వ్యవహరించిన పైలెట్.. అత్యవసర ల్యాండింగ్ చేశారు. విమానంలో ఉన్న ప్రయాణికులలో ఏపీ ప్రభుత్వ సలహాదారుడు, వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి కూడా ఉన్నారు. విజయవాడ వెళ్లాల్సిన విమానం రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ప్రత్యామ్నాయ ప్రయాణానికి ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.