అప్పట్లో టాలీవుడ్ ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన ‘జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమా’ వచ్చి 30 ఏళ్లు అయిందట. అయితే దాని నిర్మాత తప్పకుండా ఆ సినిమాకు సీక్వెల్ తీస్తానని కరాఖండిగా చెప్పేశారు కూడా. కొద్ది రోజులు చిరంజీవి కొడుకు రామ్ చరణ్, శ్రీదేవి కుమార్తె జాహ్నవి జంటగా ఈ సినిమా తీస్తారని వార్తలు కూడా వచ్చాయి. కానీ చివరికి ఆ నిర్మాత తన ప్రతిజ్ఞను పునరుద్ధరించాడు.
ఇకపోతే ఆ సినిమా యొక్క గొప్పతనం గురించి సోషల్ మీడియాలో తెగ ఊదరగొట్టేస్తున్నారు. ఆల్ టైమ్ క్లాసిక్ అని ఆ సినిమాకి చాలా పెద్ద ముద్ర వేయడమే కాకుండా చిరంజీవి అప్పట్లో 106 డిగ్రీల జ్వరంతో డ్యాన్సులు చేశారు అని కూడా రాస్తున్నారు. ఈ సినిమా బంపర్ హిట్.. అందులో తిరుగు లేదు. కానీ దానికి కల్ట్ క్లాసిక్ అనే ముద్ర వేసినప్పుడే సినిమా ప్రేమికుల మనసులు ఒప్పుకోవడం లేదట. అన్నీ కమర్షియల్ హంగులతో రంగరించిన ఒక సక్సెస్ ఫార్ములాతో ఫ్యాంటసీ సినిమాని తెరకెక్కించే లక్షలాది రూపాయలు ఈ చిత్రం వసూలు చేయగా పెద్ద పెద్ద సినిమా పండితులే ఆశ్చర్యపోయారు.
అయితే ఆ సినిమాపై ఇప్పటికే అనేక మందికి కొన్ని తీరని అనుమానాలు ఉన్నాయి. ఆ సినిమా విడుదలైన రెండు రోజులకు ఈనాడు తన ఎడిట్ పేజీలో సినిమాను వెక్కిరిస్తూ వ్యంగ్యంగా ‘మతిలేని వీరుడు గతి లేని సుందరి’ పేరిట ఒక ఆర్టికల్ కూడా వేసింది. ఆ చర్చ వచ్చినప్పుడు ఒక అతను చెప్పిన మాట ఏమిటంటే… సినిమా దర్శకుడు రేలంగి నరసింహారావు ఆ కథను ఒక నిర్మాతతో చెప్పారట. రాజేంద్రప్రసాద్ తో ఆ సినిమాను కూడా ప్రారంభించారు. చివరికి అదే కథను రాఘవేంద్రరావు చిరంజీవితో తీస్తున్నట్లు తెలుసుకుని ఆయనను కలుసుకుని మొరపెట్టుకున్నారు.
అయితే తమ సినిమా పూర్తి కావడానికి ఇంకా చాలా సమయం పడుతుంది…. కాబట్టి రేలంగిని త్వరగా తన సినిమాను పూర్తిచేసి విడుదల చేసుకోమని చెప్పినట్లు సమాచారం. ఇకపోతే రెండు సినిమాలు చిరంజీవి, రాజేంద్రప్రసాద్ మార్కెట్లను బట్టి ఆడాయి. ఒకరి దగ్గర కథ విని మరొకరికి చెప్పుకునే కథాచోరులు మన సినీ ఇండస్ట్రీలో మామూలే. అయితే చాలా మందికి ఇది కేవలం ఒక వార్త
ఇక రాజేంద్రప్రసాద్ సినిమా కి వస్తే ఆ సినిమా పేరు రంభ-రాంబాబు. అందులో రాజేంద్రప్రసాద్ సరసన పారిజాత అనే ఒక అనామక హీరోయిన్ నటించింది. అందులో చంద్రమోహన్ నారద పాత్రధారి కాగా దాసరి నారాయణరావు యమధర్మరాజు. అందులో కథానాయకి పాత్ర దేవనర్తకి రంభ. నిజానికి ఈ సినిమాకి మరియు జగదేకవీరుడు అతిలోకసుందరి సినిమాకి మానవుడు-దేవకన్య తప్ప వేరే పోలికలు లేవు. కథ మొత్తం వేరే…. ట్రీట్మెంట్ కూడా వేరే. అయితే రేలంగి ముందు వేరే కథ అనుకొని రాఘవేంద్రరావు లాంటి పెద్ద దర్శకుడు దెబ్బకు కథలో మార్పులు చేశారా అన్న అనుమానం ఇప్పటికీ చాలామందిలో ఉండిపోయింది.
అయితే కమర్షియల్ సినిమాకు సంబంధించి రాఘవేంద్రరావు స్టైల్ మనకి తెలిసిందే. ఇక ఆ సినిమాలో ఇళయరాజా ఇచ్చిన ట్యూన్స్ ఇప్పటికీ అందరి చెవుల్లో మోగుతూనే ఉంటాయి. ఇక ఈ సినిమా కాపీయా కాదా…. అన్నది రెండు సినిమాల దర్శక-నిర్మాతలు నలుగురికే తెలియాలి. ఇక ఎన్నో మధ్య బాక్సాఫీస్ రికార్డులను కొల్లగొట్టిన ఈ చిత్రాన్ని క్లాసిక్ కన్నా కూడా ఒక కమర్షియల్ పెద్ద సక్సెస్ అయిన సినిమా గా చెప్పడం మంచిది. అచ్చం మొన్న వచ్చిన మన బాహుబలి లాగా.