లాక్ డౌన్ ఎఫెక్ట్ చాలా రంగాలపై కనబడుతోంది. దాదాపు రెండు నెలలకు పైగా ప్రజలెవరూ బయటకు రాకపోవటంతో అన్ని రంగాలు క్లోజ్ అవటంతో వ్యాపార లావాదేవీలు జరగకపోవడంతో వివిధ రంగాల యజమానులపై ఫుల్ ఎఫెక్ట్ పడుతోంది. లాక్ డౌన్ వల్ల చాలా మంది ఉద్యోగాలు కోల్పోతున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈ ఎఫెక్ట్ మీడియా రంగానికి కూడా తాకింది.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో మొదటి లో చాలా వార్తా పత్రికలు లాక్ డౌన్ వల్ల క్లోజ్ అయిపోయిన వార్తలు మనం చూశాం. అయితే ఇప్పుడు తాజాగా 2 తెలుగు టాప్ న్యూస్ ఛానల్స్ కరోనా మహమ్మారి లాక్ డౌన్ ఎఫెక్ట్ కి దుకాణం సర్దుకోవడానికి రెడీగా ఉన్నట్లు వార్తలు గట్టిగా వస్తున్నాయి.
ముఖ్యంగా ఉద్యోగస్తులకు నెలసరి జీతాలు ఇవ్వలేని పరిస్థితి దాపూరించడంతో ఆ రెండు చానెల్స్ యాజమాన్యాలు చానెల్స్ ఏతేసుకోవడానికి రెడీగా ఉన్నట్లు… కనీసం ఎవరూ కూడా ప్రకటనలు కూడా ఇవ్వక పోవటంతో ఆ రెండు తెలుగు టాప్ చానల్స్ క్లోజ్ అయ్యే పరిస్థితికి సిచువేషన్ మారినట్లు సమాచారం. ఇందులో ఒక న్యూస్ ఛానల్ గత 10 సంవత్సరాల నుండి తీవ్ర నష్టాలలో ఉండటంతో త్వరలోనే మూసివేయడం లేదా ఎవరికైనా అమ్మేయడానికి యాజమాన్యం రెడీగా ఉన్నట్లు టాక్.