Vishakapatnam : దెబ్బ మీద దెబ్బ అంటే ఇదే. విశాఖ ఉక్కు పరిశ్రమ కార్మికులకు షాకింగ్ న్యూస్. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ…. విశాఖలో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఉద్యమం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ ఉద్యమంలో వేలాది మంది కార్మికులు పాల్గొంటున్నారు. స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ నిలిపివేసే వరకు ఉద్యమం కొనసాగుతుందని కార్మికులు ఇప్పటికే స్పష్టం చేశారు. అయితే, ఈ సమయంలో ప్యాక్టరీలో కరోనా కలకలం నెలకొంది.
Vishakapatnam స్టీల్ ప్లాంట్లో షాకింగ్ న్యూస్..
విశాఖ స్టీల్ ప్లాంట్ లో కరోనా కలకలం రేగింది. ఇద్దరు సీఐఎస్ఎఫ్ జవాన్లు సహా పలువురికి కరోనా సోకింది. దీంతో కార్మికులు కలవరపాటుకు గురవుతున్నారు. స్టీల్ ప్లాంట్ లో కరోనా కేసులు పెరుగుతుండటంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఆందోళన సమయంలోనూ , ఇటు విధుల నిర్వహణలోనూ కార్మికులు అప్రమత్తంగా ఉండాలని పలువురు సూచిస్తున్నారు.
ఏపీలో డేంజర్ బెల్స్….
ఇక ఇదిలా ఉంటే గత రెండు రోజులుగా ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే ఏపీలో 700 లకు పైగా కరోనా కేసులు నమోదయ్యాయి. శుక్రవారం దేశంలో 59 వేలకు పైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్నట్టు నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజలు అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు.