Andhra Pradesh: విజయవాడలోని ప్రభుత్త్వాసుపత్రిలో ఓ యువతిని సామూహిక మానభంగం చేసిన ఘటన రాజకీయంగా కాక రేపిన సంగతి తెలిసిందే. ఆ ఘటన ఇప్పుడు అధికార, ప్రతిపక్షాల మధ్య చిచ్చు పెట్టింది.. చంద్రబాబు సహా బోండా ఉమాకు మహిళా కమీషన్ నోటీసులు ఇవ్వడం.. వారు తిరిగి విమర్శలు చేయడం తెలిసిందే.. ఇది ఇలా ఉండగా.. ఈరోజు మరో దారుణ ఘటన వెలుగు చూసింది.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
బట్టల షాపులో పనిచేస్తున్న బాలికను ఓ ఆటో డ్రైవర్ పలుమార్లు అత్యాచారం చేసిన ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసారు. ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల గ్రామనికి చెందిన ఓ బాలిక స్థానికంగా ఏ బట్టల షాపులో పని చేస్తుంది. షాపుకు వచ్చేటప్పుడు, వెళ్లేటప్పుడు అదే గ్రామానికి చేసిన ఓ ఆటోడ్రైవర్ ద్వారా ఆటో ఎక్కేది. ఈ క్రమంలోనే సదరు ఆటో డ్రైవర్ బాలికను పెళ్లి చేసుకుంటానంటూ నమ్మించి.. పలుమార్లు అత్యాచారం చేసారు. కొన్నాళ్ళు గడిచాక ఆ ఆటోడ్రైవర్ కి పెళ్లయినట్టు బాలిక గుర్తించింది..!
Andhra Pradesh: పోక్సో చట్టం: కేసు నమోదు..!
డ్రైవర్ కి పెళ్లి అయినట్లు తెలుసుకున్న బాలిక మోసపోయానని గుర్తించి.. వెంటనే తల్లిదండ్రులకు ఈ విషయాన్నీ చెప్పింది. బాలిక తల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసారు. ఈ మేరకు ఆటో డ్రైవర్ పై పోక్సో కేసు నమోదు చేసిన్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా సంచలనం కలిగిస్తుంది.