ఏపిలో పార్టీ బలోపేతానికి బీజేపీ కసరత్తు చేస్తొంది. తెలంగాణలో దూసుకువెళుతున్న విధంగా ఏపీలో ఆ పార్టీ బలోపేతం కావడం లేదన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ నేపథ్యంలో ఏపిలోనూ ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అయిదు వేల ప్రదేశాల్లో వీధి సమావేశాలు, బహిరంగ సభలు జరపాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రజాసమస్యలను గుర్తించి ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు ఎనిమిది మంది సభ్యులతో కుడిన కమిటీని బీజేపీ ఏర్పాటు చేసింది. దీనికి కన్వీనర్ గా రిటైర్డ్ ఐఏఎస్ అధికారి, మాజీ సీఎస్ ఐవైఅర్ కృష్ణారావు ను బీజేపీ నియమించింది.
ఆ సెలబ్రిటీలతో బీజేపీ అగ్రనేత జేపి నడ్డా భేటీ.. ఎందుకంటే..?
ఇదే క్రమంలో రాష్ట్ర స్థాయి ఇన్ చార్జి, జోనల్ లను నియమించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. రాష్ట్ర ఇన్ చార్జిగా ఎస్ విష్ణు వర్ధన్ రెడ్డి, ఉత్తరాంధ్ర జోన్ ఇన్ చార్జిగా ఎం పరుసురామ రాజు, కోస్తా ఆంధ్ర ఇన్ చార్జిగా కోలా ఆనంద్, గోదావరి జోన్ ఇన్ చార్జిగా టి చౌదరి, రాయలసీమ జోన్ ఇన్ చార్జిగా పనతాల సురేష్ లను నియమించింది పార్టీ. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గాల్లో వీధి సమావేశాలు, బహిరంగ సభలు నిర్వహించడం ద్వారా ప్రజా సమస్యలపై ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని నిర్ణయించింది. రాష్ట్రాన్ని సమగ్ర అభివృద్ధిలో నడిపే సత్తా వైసీపీ ప్రభుత్వానికి లేదని విమర్శించింది. రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ఒక్కొక్కటిగా ప్రజలకు వివరించే దిశగా పలు కార్యక్రమాలను రూపకల్పన చేస్తున్నారు.
టీడీపీ ఆశలపై నీళ్లు చల్లిన ఏపీ బీజేపీ కో ఇన్ చార్జి సునీల్ ధియోదర్.. మ్యాటర్ ఏమిటంటే..?