AP Cabinet Decisions: ఏపీలో జర్నలిస్ట్ లకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అర్హులైన జర్నలిస్ట్ లకు మూడు సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహనరెడ్డి అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమవేశంలో పలు కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకున్నారు.
ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది.
కులగణనకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
జగనన్న సురక్ష కార్యక్రమానికి కేబినెట్ అభినందనలు తెలిపింది.
జర్నలిస్ట్ లకు ఇళ్ల స్థలాల పంపిణీకి కేబినెట్ ఆమోదం తెలుపుతూ ప్రతి జర్నలిస్ట్ కు 3 సెంట్ల స్థలం ఇవ్వాలని నిర్ణయించింది.
6,790 ప్రభుత్వ పాఠశాలల్లో ప్యూచర్ స్కిల్స్ పై బోధన
క్రీడాకారుడు సాకేత్ మైనేనికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయం
ఫెర్రోఅలైస్ కంపెనీలకు ఎలక్ట్రిసిటీ చార్జీలు మినహాయింపు, దీంతో ప్రభుత్వంపై రూ.766కోట్ల భారం పడుతుంది. 50వేల మంది కార్మికులు ఆధారపడినందుకు ఈ నిర్ణయం.
అణగారిన వర్గాల అభ్యున్నతికి కులగణన మరింత ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా సీఎం జగన్ పేర్కొన్నారు. మంత్రులు అందరూ జగనన్న సురక్ష కార్యక్రమంలో భాగస్వాములు కావాలని తెలిపారు. నవంబర్ 15 నుండి డిసెంబర్ 15 వరకూ ఆరోగ్య శ్రీ పై మరో సారి అవగాహన కార్యక్రమం నిర్వహించాలని సీఎం జగన్ తెలిపారు.
YS Sharmila: వైఎస్ షర్మిల మిడిల్ డ్రాప్ …ఎన్నికల్లో పోటీపై కీలక నిర్ణయం