YS jagan: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసిఆర్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. గురువారం ఉదయం తాడేపల్లి నుండి బయలుదేరిన సీఎం జగన్.. 11.30 గంటలకు బేగంపేట ఎయిర్ పోర్టుకు చేరుకున్నారు. అక్కడ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వరరెడ్డి స్వాగతం పలికారు.
తదుపరి బంజారాహిల్స్ నందినగర్ లోని కేసిఆర్ నివాసానికి చేరుకుని పరామర్శించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. గత నెలలో ఫామ్ హౌస్ లో కేసిఆర్ ప్రమాదవశాత్తు జారిపడటంతో ఎడమ తుంటి వెముక విరిగింది. దీంతో యశోదా ఆసుపత్రిలో కేసిఆర్ కు వైద్యులు శస్త్ర చికిత్స చేశారు.
ఆసుపత్రిలో ఉన్న సమయంలోనే జగన్ వెళ్లి పరామర్శించాలని భావించారు కానీ పర్యటన వాయిదా పడింది. ఆసుపత్రి నుండి డిశార్జ్ అయిన అనంతరం తన నివాసంలో కేసిఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. సీఎం జగన్ వెంట ఎమ్మెల్సీ తలశిల రఘురామ్, ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరావు, ఎంపీ మిథున్ రెడ్డి తదితరులు ఉన్నారు.
YS Sharmila: కాంగ్రెస్ లో వైఎస్ఆర్ టీపీ విలీనం .. కాంగ్రెస్ కండువా కప్పుకున్న వైఎస్ షర్మిల