YS Jagan: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తమ పార్టీకి చెందిన నేతలు, ఎమ్మెల్యేల నివాసాల్లో జరిగే శుభ కార్యాలయకు తప్పనిసరిగా హజరవుతుంటారు. బంధువుల ఇళ్లకు మాత్రం సతీ సమేతంగా హజరవుతుండగా, పార్టీ నేతలకు సంబంధించిన వారి కార్యక్రమాల్లో తాను ఒక్కరు మాత్రమే హజరవుతుంటారుయ తమ అభిమాన నాయకుడు వాళ్ల ఇళ్లలో జరిగే కార్యక్రమాలకు హజరు కావడంతో వారు ఆనందిస్తుంటారు.
తాజాగా ఇవేళ కాకినాడ జగ్గంపేట నియోజకవర్గంలో పర్యటించారు. వైసీపీ ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు కుమార్తె వివాహ వేడుకలో పాల్గొన్నారు. ఇర్రిపాకలోని ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు నివాసానికి వెళ్లిన సీఎం జగన్ .. నూతన వధూవరులు అన్నపూర్ణ, సాయి ఆదర్శ్ లను ఆశీర్వదించారు. తొలుత ఇర్రిపాకలో సీఎం జగన్ రాక సందర్భంగా ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్ద పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు ఆయనకు స్వాగతం పలికారు. మంత్రులు తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పినిపె విశ్వరూప్ తదితరులు పాల్గొన్నారు.