CM YS Jagan: విజయవాడలో మనందరి ప్రభుత్వం ఏర్పాటు చేసిన 206 అడుగుల అంబేద్కర్ గారి మహాశిల్పం రాష్ట్రానికే కాదు, దేశానికే తలమానికం అని సీఎం వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇది “స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్’’. చరిత్రను తిరగరాసేలా, మరెందరికో వందల సంవత్సరాల పాటు, స్ఫూర్తినిస్తుందని అన్నారు. ఈనెల 19న జరిగే విగ్రహా విష్కరణకు అందరూ స్వచ్ఛందంగా తరలిరావాలని సీఎం వైఎస్ జగన్ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు సీఎం జగన్ వీడియో సందేశాన్ని విడుదల చేశారు.
కాగా, తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో ఇవేళ వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణ పోస్టర్ ను విడుదల చేశారు. సామాజిక సమతా సంకల్పం సభ, సామాజిక న్యాయ మహా శిల్పం పేరుతో పోస్టర్ ను విడుదల చేశారు. అంబేద్కర్ రచించిన రాజ్యాంగం సమసమాజాన్ని నిర్మించిందని, సీఎం వైఎస్ జగన్ అంబేద్కర్ ఆశయాలను అమలు చేస్తున్నారని అన్నారు. దేశంలో మరెక్కడా లేని విధంగా ఆంబేద్కర్ విగ్రహాన్ని రూపొందించారని, భావితరాలకు అందించేలా నిర్మాణం చేశారని చెప్పారు. ఈ విగ్రహావిష్కరణకు అందరూ ఆహ్వానితులేనని పేర్కొన్నారు.
బెజవాడ నడిబొడ్డున ఉన్న విశాలమైన స్వరాజ్య మైదానంలో 85 అడుగుల ఎత్తైన పెడస్టల్ పైన 125 అడుగుల అంబేద్కర్ కాంస్య విగ్రహం ఠీవిగా నిలబడింది. ఇది ప్రపంచంలోనే అతి పెద్ద విగ్రహం.. దేశంలోని అన్ని విగ్రహాల్లో మూడో స్థానం. దేశంలో అతి పెద్ద విగ్రహాల్లో గుజరాత్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం (స్టాట్యూ ఆఫ్ యూనిటీ – 597 అడుగుల ఎత్తు) మొదటి స్థానంలో ఉండగా, రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా శంషాబాద్ పరిధిలో ముచ్చింతల్ లోని సమతామూర్తి విగ్రహం (స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ – 216 అడుగుల ఎత్తు) నిలుస్తుంది. మూడో స్థానంలో విజయవాడలోని అంబేద్కర్ కాంస్య విగ్రహం (స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్) నిలుస్తొంది. ఈ విగ్రహం మొత్తం ఎత్తు 320 అడుగులు.
Supreme Court: చంద్రబాబు ఫైబర్ నెట్ కేసులో మరో ట్విస్ట్ ..