NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

ఎమ్మెల్యేగా కూడా చంద్రబాబు అన్ ఫిట్ … అసెంబ్లీలో పోలవరంపై చర్చలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చి ఘాటు వ్యాఖ్యలు చేసిన సీఎం జగన్

టీడీపీ అధినేత చంద్రబాబు పై మరో సారి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఏపి సీఎం వైఎస్ జగన్. పోలవరం ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వ తప్పిదాలను తమకు ఆపాదించాలని చూస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు చేసిన తప్పుల వల్లనే ప్రాజెక్టు ఆలస్యం అయ్యిందని ఆరోపించారు. నిజాలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ అన్నారు సీఎం జగన్. ఏపి అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు .. సోమవారం పోలవరం పై చర్చ సందర్భంగా టీడీపీ విమర్శలు, ఆరోపణలకు కౌంటర్ ఇస్తూ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. పోలవరం విషయంలో ఆర్ అండ్ ఆర్ పరిహారం కింద గత ప్రభుత్వం కంటే ఎక్కువే పరిహారం ఇస్తామని చెప్పామనీ, దానికి కట్టుబడే ఉన్నామని అన్నారు. అందుకు సంబంధించిన జీవో కూడా జారీ చేయడం జరిగిందని గుర్తు చేశారు. 30 జూన్ 2021న విడుదల చేసిన జీవోను చూపించారు సీఎం జగన్.

AP CM YS Jagan

 

ఆర్ అండ్ ఆర్ కింద గత ప్రభుత్వంలో రూ.6.86 లక్షల పరిహారం ప్రకటిస్తే తాము అధికారంలోకి వస్తే పది లక్షల రూపాయలు ఇస్తామని చెప్పామనీ, అందుకు సంబంధించిన జీవో స్పష్టంగా ఉందని తెలిపారు. ఈ పెంపు వల్ల రూ.500 కోట్లు మాత్రమే అదనంగా ఖర్చు అవుతుందని, ఎవరూ భయపడాల్సిన, భాదపడాల్సిన అవసరం లేదని అన్నారు. అమ్మఒడి, ఆసలా వంటి పథకాలకే అంతకు మించి సొమ్ము బటన్ నొక్కి బదిలీ చేశామనీ, కాబట్టి పోలవరం బాధితులకు పునరావాసం పూర్తి కాగానే పరిహారం బదిలీ చేస్తామని జగన్ స్పష్టం చేశారు. పోలవరం ప్రాజెక్టును నాశనం చేసిందే చంద్రబాబు అని పేర్కొన్న.. జగన్ దాని రిపేర్ కు తమ ప్రభుత్వం కుస్తీలు పడుతోందని తెలిపారు. కేంద్రం నుండి రూ.2,900 కోట్ల నిధులు రావాల్సి ఉందనీ, ఆ నిధులు బ్లాక్ కావడానికి కారణం చంద్రబాబేనని విమర్శించారు. ఆనాడు కేంద్రాన్ని నిలదీయాల్సిన చంద్రబాబు ఆప్పుడు ఏమీ మాట్లాడకుండా ఇప్పుడు తమను విమర్శిస్తున్నారని మండిపడ్డారు.

పోలవరం ప్రాజెక్టు విషయంలో గణాంకాలను పరిశీలిస్తే ఎవరి చిత్తశుద్ది ఎంత ఉందో స్పష్టమవుతుందన్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో 3073 మందికి రూ.193 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని పేర్కొన్న సీఎం జగన్.. ఈ మూడేళ్లలో తమ ప్రభుత్వం 10,300 మందికి రూ,1722 కోట్లు ఖర్చు చేయడం జరిగిందని వివరించారు. ప్రాజెక్టుకు మొదట స్పిల్ వే, అప్రోచ్ ఛానల్ పనులు పూర్తి చేసి ఆ తర్వాత కాపర్ డ్యామ్ కట్టాల్సి ఉందన్నారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నీ సరి చేస్తున్నామన్నారు. ప్లానింగ్ లేకుండా కట్టడం వల్లనే ఇాలంటి దుస్థితి వచ్చిందని జగన్ అన్నారు. చంద్రబాబు అసలు ఎమ్మెల్యే గా కూడా అన్ ఫిట్ అంటూ వ్యాఖ్యానించారు. వర్షాకాలంలో పనులు జరగలేదనీ, నవంబర్ నుండి యుద్ద ప్రాతిపదికన పనులు జరుగుతాయని జగన్ తెలిపారు. ముందుగా టీడీపీ సభ్యులు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, నిమ్మల రామానాయుడు, నిమ్మకాయల చిన రాజప్ప, కింజారపు అచ్చెన్నాయుడు పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల పరిహారంపై అడిగిన ప్రశ్నకు జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు సమాధానం ఇచ్చారు.

ప్రారంభమైన ఏపి అసెంబ్లీ మూడవ రోజు సమావేశాలు

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N