NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్ రాజ‌కీయాలు

CM YS Jagan: జరగబోయేది పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని పునరుద్ఘాటించిన సీఎం జగన్

CM YS Jagan: త్వరలో జరగబోయే ఎన్నికల కురుక్షేత్రంలో నిరుపేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం జరగబోతుందని ఏపీ సీఎం వైఎస్ జగన్ అన్నారు. విజయవాడలోని విద్యాధరపురంలో వరుసగా అయిదవ ఏడాది వాహనమిత్ర నిధులను సీఎం జగన్ శుక్రవారం విడుదల చేశారు. వాహనమిత్ర పథకంతో ఆటో డ్రైవర్లు, ట్యాక్సీ డ్రైవర్లు లబ్దిపొందుతుండగా, 2,75,931 మంది ఖాతాల్లోకి రూ.10వేల వంతున జమ చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో సీఎం జగన్ మాట్లాడుతూ ..99 శాతం హామీలు అమలు చేశామని తెలిపారు. ఒక వైపు పేదల ప్రభుత్వం ఉంటే మరో వైపు పేదలను మోసం చేసిన వారు ఉన్నారని విమర్శించారు.

మేనిఫెస్టోలో చెప్పింది చెప్పినట్లుగా తాము అమలు చేశామని అన్నారు. మేనిఫెస్టోను గత ప్రభుత్వం చెత్త బుట్టలో వేసిందని విమర్శించారు. లంచం, వివక్షతకు తావు లేకుండా నేరుగా లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నామన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు అన్ని రకాలుగా ఈ ప్రభుత్వం న్యాయం చేస్తుందన్నారు. మీ ఇంట్లో మేలు జరిగి ఉంటేనే వచ్చే ఎన్నికల్లో తనను ఆశీర్వదించాలని జగన్ కోరారు. ప్రత్యర్ధులు అనేక రకాలుగా ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా ఇప్పటి వరకూ 1300 కోట్ల రూపాయలు ఇచ్చామని చెప్పిన సీఎం జగన్.. వైఎస్ఆర్ వాహన మిత్ర అమలు చేస్తున్నందుకు తాను గర్వపడుతున్నానని తెలిపారు. పథకాన్ని అవినీతికి తావులేకుండా చేస్తున్నామని చెప్పారు. అమ్మఒడి, నేతన్న నేస్తం తదితర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించిన సీఎం జగన్ .. తమది పేదల కోసం పని చేస్తున్న ప్రభుత్వమని అన్నారు. గత ప్రభుత్వం ఇలాంటి పథకాలను అమలు చేసిందా అని జగన్ ప్రశ్నించారు.  చిరు వ్యాపారులకు కూడా ప్రభుత్వం అండగా నిలుస్తొందని చెప్పారు. పేదలకు ఇళ్ల స్థలాలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ఆ స్థలాల్లో ఇంటి నిర్మాణాలను చేపడుతున్నామని అన్నారు.

గతంలోనూ ఇదే బడ్జెట్, మారిందల్లా సీఎం ఒక్కరేననీ, గతంలో ఎందుకు ఈ పథకాలు ఇవ్వలేకపోయారని సీఎం జగన్ ప్రశ్నించారు. పేదవాడి ప్రభుత్వం నిలబడాలి, పెత్తందారుల ప్రభుత్వం రాకూడదని అన్నారు. వచ్చే ఎన్నికల్లో వీటన్నింటినీ గుర్తించి ఆలోచించాలని జగన్ సూచించారు. వాళ్లకు అధికారం కావాల్సింది దోచుకోవడానికి, దోచుకున్నది పంచుకోవడానికేనని విమర్శించారు. వాళ్లలాగా తనకు దత్తపుత్రుడు తోడు లేరనీ, వాళ్ల మాదిరిగా గజదొంగల ముఠా తోడుగా లేదనీ, దోచుకొని పంచుకొని తినడం తమ విధానం కాదని జగన్ స్పష్టం చేశారు.

AP High Court: నారా లోకేష్ ముందస్తు బెయిల్ పిటిషన్ లో కీలక పరిణామం .. మరో రెండు కేసుల్లో ముందస్తు బెయిల్ కు లోకేష్ పిటిషన్‌లు

Related posts

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Congress: పార్టీ కండువా కప్పుకున్నా .. చేరికకు బ్రేక్ .. తెలంగాణ కాంగ్రెస్ లో విచిత్రం

sharma somaraju

ఏపీ ఎన్నిక‌ల్లో ఇప్పుడు అన్ని పార్టీల‌కు ‘ 15 ‘ టెన్ష‌న్ స్టార్ట్‌…?

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

నిన్న భువ‌నేశ్వ‌రి.. నేడు చంద్ర‌బాబు.. ఏంటీ ఫేక్‌ పాలిటిక్స్ .. !

‘ ఇక్క‌డున్న‌ది జ‌గ‌న్ రా ‘ బాబు… కూట‌మి అంత లైట్ అయ్యిందా ?

Lok Sabha Elections 2024: ఆప్ ప్రచార బాధ్యతలు చేపట్టిన కేజ్రీవాల్ సతీమణి సునీతా కేజ్రీవాల్ .. ఢిల్లీలో రోడ్ షో

sharma somaraju

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N