AP Govt: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వ ఉద్యోగుల బదిలీలకు సీఎం వైఎస్ జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన దస్త్రంపై సీఎం ఆమోదమువేయడంతో ప్రభుత్వం మంగళవారం సాధారణ బదిలీలపై నిషేదం ఎత్తివేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. జూన్ 8 (రేపు) నుండి 17వ తేదీ వరకూ బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయిదేళ్లు పైబడి ఉద్యోగులకు బదిలీ అవకాశం కల్పిస్తున్నారు. వ్యక్తిగత వినతులు, పరిపాలన సౌలభ్యం అధారంగా బదిలీలను చేపడుతున్నారు.
- Read the latest news from NEWSORBIT
- Follow us on facebook , Twitter , instagram and Googlenews
AP Govt: బదిలీలపై పది రోజులు నిషేదం ఎత్తివేత
కరోనా నేపథ్యంలో రాష్ట్రంలో రెండేళ్లుగా ఉద్యోగుల బదిలీలకు ప్రభుత్వం అవకాశం ఇవ్వలేదు. అయితే గత ఏడాది డిసెంబర్ నెలలో ఉద్యోగుల పరిస్పర బదిలీలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఉద్యోగ సంఘాల విజ్ఞప్తిపై నాడు ప్రభుత్వం పరస్పర బదిలీలకు అవకాశం ఇచ్చింది. ఆనాడు ఏసీబీ, విజిలెన్స్ కేసులు ఉన్న ఉద్యోగులకు పరస్పర బదిలీలకు అవకాశం ఇవ్వలేదు. అయిదేళ్లకు పైగా ఒకే ప్రదేశంలో ఉద్యోగాలు చేస్తున్న వారు బదిలీలపై బ్యాన్ ఉండటంతో ఇబ్బందులు పడుతున్నా కొనసాగుతున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం పది రోజుల పాటు సాధారణ బదిలీలకు అవకాశం కల్పిస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు.