ఏపిలో ఉపాధ్యాయ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి లు ఉపాధ్యాయ సమస్యలపై దృష్టి పెట్టారు. తొలి విజయాన్ని సాధించారు. అసెంబ్లీలో సీఎం వైఎస్ జగన్మోహనరెడ్డిని వీరు కలిశారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయ సమస్యలపై సీఎం జగన్ కు విజ్ఞానపత్రం అందజేశారు. మహిళా ఉద్యోగుల చైల్డ్ కేర్ లీవ్ సమస్యలను సీఎం దృష్టికి తీసుకురాగా .. ఆయన సానుకూలంగా స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

ప్రభుత్వ మహిళా ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ ను తమ సర్వీస్ కాలంలో ఎప్పుడైనా ఉపయోగించుకునే వెసులుబాటు కల్పించేందుకు సీఎం జగన్ ఆమోదముద్ర వేశారు. ప్రస్తుతం ఈ చైల్డ్ కేర్ లీవ్ ను పిల్లలకు 18 ఏళ్ల వయసు వచ్చే వరకూ మాత్రమే ఉపయోగించుకోవాలన్న నిబంధన ఉంది. దీనిని సవరించి మహిళా ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని అధికారులను సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు.
అదే విధంగా ప్రైవేటు స్కూళ్ల రెన్యువల్ ఆఫ్ రికగ్నేషన్ ను మూడేళ్ల నుండి ఎనిమిదేళ్ల కు పెంచాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు కోరగా దీనిపైనా సానుకూలంగా స్పందించిన సీఎం జగన్ ఆ మేరకు ఉత్తర్వులు జారీ చేయాలని అధికారులను ఆదేశించారు. తాము కోరిన వెంటనే సీఎం జగన్ స్పందించి మహిళా ఉద్యోగులకు మేలు చేస్తూ నిర్ణయం తీసుకోవడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి.
వైఎస్ వివేకా హత్య కేసులో కీలక పరిణామాలు .. సీబీఐపై సుప్రీం కోర్టు సీరియస్