AP Govt: ప్రభుత్వ ఉత్తర్వులను ప్రజలకు తిరిగి అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రజలకు అవసరమైన జీవోలన్నీ ఇకపై ఏపి ఈ – గెజిట్ లో పెడతామని ప్రకటించింది. జీవోలను ప్రభుత్వ డొమైన్ లో పెట్టకుండా నిలిపివేసిన ఉత్తర్వులను తిరిగి జారీ చేయాలని ఏపి సర్కార్ నిర్ణయించింది. జీవోలను ఈ – గెజిట్ ద్వారా జారీ చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు జారీ చేశారు.
జీవో ఐఆర్ వెబ్ సైట్ ను నిలిపివేసినందున సమాచార హక్కు ప్రయోజనాలను భంగం కలగకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నట్లు సమాచారం. అయితే ప్రజలకు అవసరం లేని సమాచారాన్ని ఈ గెజిట్ లో ఉంచడం జరగదని వెల్లడించారు. వ్యక్తిగత సమాచారం, తక్కువ మొత్తంలో ఖర్చులు, అధికారుల సెలవులు, గోప్యంగా ఉంచాల్సిన ఇతర అంశాలను అందుబాటులో ఉంచబోమని స్పష్టం చేసింది. ఇకపై అన్ని జీవోలు అధీకృత అధికారి డిజిటల్ సైన్ తో ఈ గెజిట్ లో అందుబాటులో ఉంటాయని ప్రభుత్వం పేర్కొంది.
ఏపి ప్రభుత్వం ఇప్పటి వరకూ జీవోలు అన్నీ జివోఐఆర్ ఏపీ అనే వైబ్ సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులో ఉంచేది. అయితే ఇటీవల ప్రభుత్వం జీవోల బహిర్గతంపై కీలక నిర్ణయాన్ని తీసుకున్నది. జివోఐఆర్ లో ఉన్న జీవోలను తీసివేస్తున్నామనీ, పబ్లిక్ డొమైన్ లో జివోలు ఉంచకూడదని నిర్ణయించినట్లు పేర్కొంది. దీనిపై ప్రతిపక్షాల నుండి విమర్శలు ఎదురుకావడంతో పాటు దీనిపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలైయ్యాయి. ఆ కేసులు విచారణకు వస్తున్న తరణంలో లేనిపోని తలనొప్పులు ఎందుకని భావించిన ప్రభుత్వం జీవోఐఆర్ స్థానంలో జివోలు అన్నీ ఏపి ఈ గెజిట్ వెబ్ సైట్ లో పెడతామని ప్రకటించింది.
Read More
1.Minister Balineni: వైసీపీలో కాక.. పేషీలో పేచీ..! మంత్రిగారి ప్రైవేట్ రష్యా పర్యటన సీక్రెట్లు ఇవీ..!!
2.YS Sharmila: ఎంఆర్పీఎస్ నేత మంద కృష్ణమాదిగతో వైఎస్ షర్మిల భేటీ..! రెండు కారణాలు..!!